ఫేక్ కరెన్సీ.. బహ్రెయిన్ వ్యక్తికి 5 ఏళ్ల జైలు శిక్ష..!!
- March 20, 2026
మనామాః ఒక హోటల్ మరియు సూపర్ మార్కెట్లో ఫేక్ కరెన్సీని ప్రోత్సహించినందుకు మరియు ఉపయోగించినందుకు, బహ్రెయిన్కు చెందిన ఒక యువకుడికి హైకోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ రెండు ప్రదేశాలలోని ఉద్యోగులు నకిలీ నోట్లను గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చాయి. అయితే, ఆ కరెన్సీ నకిలీదని తనకు తెలియదని, అప్పు తీర్చడానికి మరొక వ్యక్తి ఆ నోట్లను ఇచ్చాడని నిందితుడు విచారణలో తెలిపాడని పోలీసులు పేర్కొన్నారు.
కాగా, నిందితుడు ఒక హోటల్ గదిని అద్దెకు తీసుకుని, 20 బహ్రెయిన్ దినార్ల నోటుతో చెల్లించి, చిల్లరగా 10 దినార్లు పొందడంతో ఈ కేసు ప్రారంభమైంది. ఆ నోట్లపై అనుమానం వచ్చిన రిసెప్షనిస్ట్, హోటల్ యజమానికి తెలియజేయగా, అది ఫేక్ కరెన్సీ అని నిర్ధారణ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని గంటల తర్వాత, నిందితుడు మరో 20-దినార్ల నకిలీ నోటుతో వస్తువులు కొనడంతో, ఒక సూపర్ మార్కెట్ ఉద్యోగి కూడా ఇలాంటి ఫిర్యాదే చేశారు. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ సాయంతో అతని కదలికలను గమనించి అరెస్టు చేశారు. అయితే, ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ఆ రెండవ వ్యక్తి కోసం సెర్చ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సువెందు అధికారి పిఏ హత్య–బెంగాల్లో ఉద్రిక్తత
- ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు వద్దు…డీజీపీకి సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు
- విజయ్కు లైన్క్లియర్.. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి..
- సీజనల్ అలెర్జీలు.. అవగాహన, నివారణ, చికిత్స పై నిపుణుల సూచనలు..!!
- 2025లో యూఏఈలో 5,58,000 కొత్త డ్రైవర్లు..!!
- వీసా మినహాయింపు ఒప్పందం పై సంతకం చేసిన సౌదీ, టర్కీ..!
- భద్రతా సంబంధాలను బలోపేతానికి యూకే, బహ్రెయిన్ చర్చలు..!!
- ఇరాన్ ప్రకటనను ఖండించిన యూఏఈ..!!
- ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతపై ఒమన్, నార్వే చర్చలు..!!
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2ని ఆమోదించండి అంటూ కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్









