ఫేక్ కరెన్సీ.. బహ్రెయిన్ వ్యక్తికి 5 ఏళ్ల జైలు శిక్ష..!!
- March 20, 2026
మనామాః ఒక హోటల్ మరియు సూపర్ మార్కెట్లో ఫేక్ కరెన్సీని ప్రోత్సహించినందుకు మరియు ఉపయోగించినందుకు, బహ్రెయిన్కు చెందిన ఒక యువకుడికి హైకోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ రెండు ప్రదేశాలలోని ఉద్యోగులు నకిలీ నోట్లను గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చాయి. అయితే, ఆ కరెన్సీ నకిలీదని తనకు తెలియదని, అప్పు తీర్చడానికి మరొక వ్యక్తి ఆ నోట్లను ఇచ్చాడని నిందితుడు విచారణలో తెలిపాడని పోలీసులు పేర్కొన్నారు.
కాగా, నిందితుడు ఒక హోటల్ గదిని అద్దెకు తీసుకుని, 20 బహ్రెయిన్ దినార్ల నోటుతో చెల్లించి, చిల్లరగా 10 దినార్లు పొందడంతో ఈ కేసు ప్రారంభమైంది. ఆ నోట్లపై అనుమానం వచ్చిన రిసెప్షనిస్ట్, హోటల్ యజమానికి తెలియజేయగా, అది ఫేక్ కరెన్సీ అని నిర్ధారణ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని గంటల తర్వాత, నిందితుడు మరో 20-దినార్ల నకిలీ నోటుతో వస్తువులు కొనడంతో, ఒక సూపర్ మార్కెట్ ఉద్యోగి కూడా ఇలాంటి ఫిర్యాదే చేశారు. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ సాయంతో అతని కదలికలను గమనించి అరెస్టు చేశారు. అయితే, ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ఆ రెండవ వ్యక్తి కోసం సెర్చ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..







