ఫేక్ కరెన్సీ.. బహ్రెయిన్ వ్యక్తికి 5 ఏళ్ల జైలు శిక్ష..!!
- March 20, 2026
మనామాః ఒక హోటల్ మరియు సూపర్ మార్కెట్లో ఫేక్ కరెన్సీని ప్రోత్సహించినందుకు మరియు ఉపయోగించినందుకు, బహ్రెయిన్కు చెందిన ఒక యువకుడికి హైకోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ రెండు ప్రదేశాలలోని ఉద్యోగులు నకిలీ నోట్లను గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చాయి. అయితే, ఆ కరెన్సీ నకిలీదని తనకు తెలియదని, అప్పు తీర్చడానికి మరొక వ్యక్తి ఆ నోట్లను ఇచ్చాడని నిందితుడు విచారణలో తెలిపాడని పోలీసులు పేర్కొన్నారు.
కాగా, నిందితుడు ఒక హోటల్ గదిని అద్దెకు తీసుకుని, 20 బహ్రెయిన్ దినార్ల నోటుతో చెల్లించి, చిల్లరగా 10 దినార్లు పొందడంతో ఈ కేసు ప్రారంభమైంది. ఆ నోట్లపై అనుమానం వచ్చిన రిసెప్షనిస్ట్, హోటల్ యజమానికి తెలియజేయగా, అది ఫేక్ కరెన్సీ అని నిర్ధారణ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని గంటల తర్వాత, నిందితుడు మరో 20-దినార్ల నకిలీ నోటుతో వస్తువులు కొనడంతో, ఒక సూపర్ మార్కెట్ ఉద్యోగి కూడా ఇలాంటి ఫిర్యాదే చేశారు. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ సాయంతో అతని కదలికలను గమనించి అరెస్టు చేశారు. అయితే, ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ఆ రెండవ వ్యక్తి కోసం సెర్చ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







