కువైట్-భారత్ అనుసంధానం..జజీరా ఎయిర్వేస్కు ప్రత్యేక అనుమతి..!!
- March 20, 2026
కువైట్ః ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాంతీయ గగనతల మూసివేతల నేపథ్యంలో, కువైట్-భారత్ మధ్య ప్రయాణ అనుసంధానాన్ని పునరుద్ధరించే లక్ష్యంతో ఆరు భారతీయ విమానాశ్రయాలకు విమానాలను నడిపేందుకు జజీరా ఎయిర్వేస్కు భారత ప్రభుత్వం ప్రత్యేక అనుమతి మంజూరు చేసింది. వేలాది మంది భారత పౌరులు ఎదుర్కొంటున్న ప్రయాణ అంతరాయాలను తగ్గించేందుకు చేపట్టిన సమన్విత ప్రయత్నాలలో భాగంగా ఈ చొరవ తీసుకున్నట్లు భారత రాయబారి పరామిత త్రిపాఠి తెలిపారు.
ఫిబ్రవరి 28నుండి కువైట్ గగనతలం తాత్కాలికంగా మూసివేయడం వల్ల ప్రయాణికులకు, ముఖ్యంగా భారత్కు అత్యవసరంగా ప్రయాణించాల్సిన వారికి గణనీయమైన సవాళ్లు ఎదురయ్యాయి. ఈ సంక్షోభ సమయంలో సహాయం అందించడానికి రాయబార కార్యాలయం అధికారులు మరియు భారతీయ కమ్యూనిటీతో నిరంతరం సమన్వయం చేసుకుంటోందని రాయబారి పేర్కొన్నారు.
రియాద్లోని భారత రాయబార కార్యాలయం మరియు సౌదీ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ, సౌదీ విమానాశ్రయాల ద్వారా రవాణా సౌకర్యం కల్పించడం ద్వారా అత్యవసర ప్రయాణం అవసరమైన వారికి తాము సహాయం చేస్తున్నామని తెలిపారు. వారి నిరంతర మద్దతుతో, భారతదేశానికి ప్రయాణించడానికి 1,100 మందికి పైగా భారతీయులు సౌదీ ట్రాన్సిట్ వీసాలు పొందడంలో తాము సహాయం చేశామన్నారు.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







