రీఫండ్ ల పై ఖతార్ ఎయిర్వేస్ కీలక ప్రకటన..!!
- March 23, 2026
దోహా: రీఫండ్ అభ్యర్థనలను సాధ్యమైనంత త్వరగా ప్రాసెస్ చేసి పరిష్కరించడానికి తాము కృషి చేస్తున్నామని ఖతార్ ఎయిర్వేస్ తెలిపింది. అయితే, ప్రస్తుతం విమానయాన సంస్థ ఎదుర్కొంటున్న సవాళ్ల కారణంగా కొన్ని సందర్భాల్లో రీఫండ్లకు సాధారణం కంటే ఎక్కువ సమయం పట్టవచ్చని తెలిపింది.ఈ మేరకు సోషల్ మీడియా పోస్టులో వెల్లడించింది. ఫిబ్రవరి 28 నుండి ఏప్రిల్ 30 మధ్య ప్రయాణ తేదీని కలిగి ఉండి, తమ బుకింగ్లు నిర్ధారించబడిన వినియోగదారులు రీఫండ్ లేదా ప్రయాణ తేదీ మార్పుకు అర్హులని ఆ విమానయాన సంస్థ పేర్కొంది. రీఫండ్లు అందడానికి 28 పని దినాల వరకు సమయం పట్టవచ్చని, రీఫండ్ అభ్యర్థనను సమర్పించిన తర్వాత దాని స్థితిని తెలుసుకోవడానికి తమ ఈమెయిల్ను తనిఖీ చేసుకోవాలని కోరింది. మరింత సమాచారం, తాజా అప్డేట్ ల కోసం తమ అధికారిక వెబ్ సైట్ ను ఫాలో కావాలని సూచించింది.
తాజా వార్తలు
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం







