రీఫండ్ ల పై ఖతార్ ఎయిర్వేస్ కీలక ప్రకటన..!!
- March 23, 2026
దోహా: రీఫండ్ అభ్యర్థనలను సాధ్యమైనంత త్వరగా ప్రాసెస్ చేసి పరిష్కరించడానికి తాము కృషి చేస్తున్నామని ఖతార్ ఎయిర్వేస్ తెలిపింది. అయితే, ప్రస్తుతం విమానయాన సంస్థ ఎదుర్కొంటున్న సవాళ్ల కారణంగా కొన్ని సందర్భాల్లో రీఫండ్లకు సాధారణం కంటే ఎక్కువ సమయం పట్టవచ్చని తెలిపింది.ఈ మేరకు సోషల్ మీడియా పోస్టులో వెల్లడించింది. ఫిబ్రవరి 28 నుండి ఏప్రిల్ 30 మధ్య ప్రయాణ తేదీని కలిగి ఉండి, తమ బుకింగ్లు నిర్ధారించబడిన వినియోగదారులు రీఫండ్ లేదా ప్రయాణ తేదీ మార్పుకు అర్హులని ఆ విమానయాన సంస్థ పేర్కొంది. రీఫండ్లు అందడానికి 28 పని దినాల వరకు సమయం పట్టవచ్చని, రీఫండ్ అభ్యర్థనను సమర్పించిన తర్వాత దాని స్థితిని తెలుసుకోవడానికి తమ ఈమెయిల్ను తనిఖీ చేసుకోవాలని కోరింది. మరింత సమాచారం, తాజా అప్డేట్ ల కోసం తమ అధికారిక వెబ్ సైట్ ను ఫాలో కావాలని సూచించింది.
తాజా వార్తలు
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!
- ఫర్వానియాలో ట్రాఫిక్ సమస్యలపై గవర్నర్ సమీక్ష..!!
- షెంజెన్ వీసా రద్దీ: యూరప్ పర్యటనలకు 6 నుండి 8 వారాల నిరీక్షణ..!!









