రీఫండ్ ల పై ఖతార్ ఎయిర్వేస్ కీలక ప్రకటన..!!
- March 23, 2026
దోహా: రీఫండ్ అభ్యర్థనలను సాధ్యమైనంత త్వరగా ప్రాసెస్ చేసి పరిష్కరించడానికి తాము కృషి చేస్తున్నామని ఖతార్ ఎయిర్వేస్ తెలిపింది. అయితే, ప్రస్తుతం విమానయాన సంస్థ ఎదుర్కొంటున్న సవాళ్ల కారణంగా కొన్ని సందర్భాల్లో రీఫండ్లకు సాధారణం కంటే ఎక్కువ సమయం పట్టవచ్చని తెలిపింది.ఈ మేరకు సోషల్ మీడియా పోస్టులో వెల్లడించింది. ఫిబ్రవరి 28 నుండి ఏప్రిల్ 30 మధ్య ప్రయాణ తేదీని కలిగి ఉండి, తమ బుకింగ్లు నిర్ధారించబడిన వినియోగదారులు రీఫండ్ లేదా ప్రయాణ తేదీ మార్పుకు అర్హులని ఆ విమానయాన సంస్థ పేర్కొంది. రీఫండ్లు అందడానికి 28 పని దినాల వరకు సమయం పట్టవచ్చని, రీఫండ్ అభ్యర్థనను సమర్పించిన తర్వాత దాని స్థితిని తెలుసుకోవడానికి తమ ఈమెయిల్ను తనిఖీ చేసుకోవాలని కోరింది. మరింత సమాచారం, తాజా అప్డేట్ ల కోసం తమ అధికారిక వెబ్ సైట్ ను ఫాలో కావాలని సూచించింది.
తాజా వార్తలు
- ఢిల్లీలో ప్రధాని మోదీ హైలెవల్ మీటింగ్
- మార్చి 27 వరకు యూఏఈలో భారీ వర్షాలు..!!
- హెలికాప్టర్ ప్రమాదం..ఖతార్, టర్కీలకు బహ్రెయిన్ సంతాపం..!!
- రుస్తాఖ్ భవనం కూలి నలుగురు చిన్నారులు మృతి..!!
- కువైట్ లో అక్రమంగా డ్రోన్ వినియోగం..ఆరుగురు అరెస్టు..!!
- సౌదీలో వర్షాలు..పలు ప్రాంతాలకు రెడె, ఆరెంజ్ అలెర్ట్ జారీ..!!
- రీఫండ్ ల పై ఖతార్ ఎయిర్వేస్ కీలక ప్రకటన..!!
- నో ఓటీపీ: యాప్ వెరిఫికేషన్ను ప్రారంభించనున్న యూఏఈ బ్యాంక్..!!
- వాట్సాప్కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు









