1400 మంది ప్రయాణించగల పే..ద్ద బస్సు.. ..
- August 03, 2016
1400 మంది ప్రయాణించగల పే..ద్ద బస్సు.. అంతేకాదు.. ఓ పక్క బస్సు రోడ్డుపై వెళ్తున్నా.. దాని కింది నుంచి కార్లు శరవేగంగా దూసుకెళ్లే అధునాతన టెక్నాలజీ.. చైనాలోని బీజింగ్కు చెందిన ట్రాన్సిట్ ఎక్స్ప్లోర్ బస్ అనే సంస్థ ఇటీవల విడుదల చేసిన ఈ బస్సు మోడల్ ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంది. అయితే తొందర్లోనే ఈ బస్సు చైనా రోడ్లపై సందడి చేయనుంది. ల్యాండ్ ఎయిర్బస్గా పిలిచే ఈ బస్సును చైనా సోమవారం పరీక్షించింది.
రోడ్లపై వాహనాల విస్తీర్ణం, వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు టీఈబీ-1 పేరుతో ఈ ఏడాది మే నెలలో బస్సు మోడల్ను విడుదల చేసింది సంస్థ. తాజాగా ఈ బస్సును హెబీ ప్రావిన్స్లోని క్విన్హువాంగ్దావో రోడ్లపై పరీక్షించారు. 22 మీటర్ల పొడవు, 7.8 మీటర్ల వెడల్పు గల ఈ బస్సును ప్రత్యేక ట్రాక్పై నడిపించారు. సాధారణ బస్సుల కంటే ఈ బస్సు కంపార్ట్మెంట్ రోడ్డుకు చాలా ఎత్తులో ఉండటంతో దీని కింది నుంచి కార్లు సులువుగా వెళ్లిపోవచ్చు. బస్సు నడుస్తున్నా.. ఆగి ఉన్నా కూడా రోడ్డు మీద ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం ఉండదు. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఈ బస్సులో 1400 మంది ప్రయాణించొచ్చు.అంతేగాక పూర్తి ఎలక్ట్రిసిటీతో నడిచే ఈ బస్సు పర్యావరణహితంగా ఉంటుంది. 40 సాధారణ బస్సులతో ఈ ఒక్క బస్సు సమానమవడంతో సంవత్సరానికి దాదాపు 800 టన్నుల ఇంధన వాడకాన్ని తగ్గించొచ్చని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. అంతేగాక దీని వల్ల ఏడాదికి 2,480 టన్నుల కార్బన్ ఉద్గారాలు కూడా తగ్గుతాయట.
తాజా వార్తలు
- జాతీయ సెక్రటరీల సమావేశంలో ప్రధాని మోదీ కీలక సందేశం
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!







