అమరావతే రాజధానిగా తీర్మానం..

- March 25, 2026 , by Maagulf
అమరావతే రాజధానిగా తీర్మానం..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో నెలకొన్న సందిగ్ధతకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నెల 28 (శనివారం) న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సమావేశంలో అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఒక కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది. గత కొంతకాలంగా సాగుతున్న రాజధాని వివాదానికి ఈ తీర్మానంతో ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందిన వెంటనే, దానిని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండటంతో, ఇదే సమయంలో అమరావతికి రాజధానిగా చట్టబద్ధత కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. కేంద్రం కూడా సానుకూలంగా స్పందిస్తే, ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే రాజధానిపై ఒక స్పష్టమైన ప్రకటన లేదా చట్ట సవరణ వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

రాజధానిగా అమరావతిని ఖరారు చేయడమే కాకుండా, అక్కడ నిలిచిపోయిన నిర్మాణ పనులను వేగవంతం చేయడంపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దేందుకు అవసరమైన నిధుల సమీకరణ మరియు భవిష్యత్తు ప్రణాళికలను ప్రభుత్వం ఈ సందర్భంగా వెల్లడించవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com