పట్టాలెక్కనున్న దుబాయ్న ట్రామ్ ఫేజ్-2
- August 03, 2016
దుబాయ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, దుబాయ్ ట్రామ్ కొత్త ఫేజ్ కోసం కన్సల్టెంట్లకు ఆహ్వానం పంపింది. న్యూ ఫేజ్కి సంబంధించి ఫీజబులిటీని స్టడీ చేయాల్సిందిగా ఆర్టిఎ కోరింది. బుర్జ్ అల్ అరబ్ మదినాత్ జుమైరా మరియు మాల్ ఆఫ్ ఎమిరేట్స్ వంటి టూరిస్ట్ డెస్టినేషన్ల మీదుగా రెండో ఫేజ్ రూపుదిద్దుకోనుంది. మూడో ఫేజ్ జుమైరా బీచ్ రోడ్ నెం 2 నుంచి డిసెంరబర్ స్ట్రీట్ వరకు ఉండనుంది. 2016 తొలి క్వార్టర్లో దుబాయ్ ట్రామ్ 1.3 మిలియన్ రైడర్లను ఆకర్షించగలుగుతుందని గతంలో అదికారిక వెబ్సైట్ వెల్లడించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న దుబాయ్ ట్రామ్కి వస్తున్న ఆదరణ నేపథ్యంలో రెండో ఫేజ్ వేగవంతంగా పూర్తి చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని ఆనటిఎ సిఈఓ అబ్దుల్ మొహసెన్ చెప్పారు. 2014 నవంబర్ 11న ప్రారంభించిన దుబాట్రామ్, 11 స్టేషన్లతో 11 కిలోమీటర్ల మేర రూపొందించారు. ఇంకో వైపున దుబాయ్ మెట్రో ద్వారా 2016 తొలి క్వార్టర్లో 50 మిలియన్ ప్రజలు లబ్ది పొందారని, ఈ నేపథ్యంలో గ్రీన్లైన్ ఎక్స్పాన్షన్ కోసం చర్యలు చేపడుతున్నట్లు అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







