పట్టాలెక్కనున్న దుబాయ్‌న ట్రామ్‌ ఫేజ్‌-2

- August 03, 2016 , by Maagulf
పట్టాలెక్కనున్న దుబాయ్‌న ట్రామ్‌ ఫేజ్‌-2

దుబాయ్‌ రోడ్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ, దుబాయ్‌ ట్రామ్‌ కొత్త ఫేజ్‌ కోసం కన్సల్టెంట్లకు ఆహ్వానం పంపింది. న్యూ ఫేజ్‌కి సంబంధించి ఫీజబులిటీని స్టడీ చేయాల్సిందిగా ఆర్‌టిఎ కోరింది. బుర్జ్‌ అల్‌ అరబ్‌ మదినాత్‌ జుమైరా మరియు మాల్‌ ఆఫ్‌ ఎమిరేట్స్‌ వంటి టూరిస్ట్‌ డెస్టినేషన్ల మీదుగా రెండో ఫేజ్‌ రూపుదిద్దుకోనుంది. మూడో ఫేజ్‌ జుమైరా బీచ్‌ రోడ్‌ నెం 2 నుంచి డిసెంరబర్‌ స్ట్రీట్‌ వరకు ఉండనుంది. 2016 తొలి క్వార్టర్‌లో దుబాయ్‌ ట్రామ్‌ 1.3 మిలియన్‌ రైడర్లను ఆకర్షించగలుగుతుందని గతంలో అదికారిక వెబ్‌సైట్‌ వెల్లడించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న దుబాయ్‌ ట్రామ్‌కి వస్తున్న ఆదరణ నేపథ్యంలో రెండో ఫేజ్‌ వేగవంతంగా పూర్తి చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని ఆనటిఎ సిఈఓ అబ్దుల్‌ మొహసెన్‌ చెప్పారు. 2014 నవంబర్‌ 11న ప్రారంభించిన దుబాట్రామ్‌, 11 స్టేషన్లతో 11 కిలోమీటర్ల మేర రూపొందించారు. ఇంకో వైపున దుబాయ్‌ మెట్రో ద్వారా 2016 తొలి క్వార్టర్‌లో 50 మిలియన్‌ ప్రజలు లబ్ది పొందారని, ఈ నేపథ్యంలో గ్రీన్‌లైన్‌ ఎక్స్‌పాన్షన్‌ కోసం చర్యలు చేపడుతున్నట్లు అధికారులు చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com