ఖతార్ లో మూడు ప్రముఖ ఆహార సంస్థలు మూసివేత..!!
- March 30, 2026
దోహా: ఖతార్లో ఆహార భద్రతా చట్టాలు మరియు నిబంధనలను ఉల్లంఘించిన మూడు ప్రముఖ ఆహార సంస్థలను తాత్కాలికంగా మూసివేయాలని మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
అల్ షహానియా మున్సిపాలిటీలో ఉన్న 'గోర్ఖా మీట్ ట్రేడింగ్ కంపెనీ' నిబంధనల ప్రకారం లేబులింగ్పై తప్పనిసరిగా ప్రదర్శించాల్సిన సమాచారాన్ని పొందుపరచకుండా ప్యాకేజ్ చేసిన ఆహార ఉత్పత్తులను విక్రయించింది. దీంతో మార్చి 26 నుండి 14 రోజుల పాటు పూర్తిగా మూసివేయాలని ఆదేశించారు.
అల్ షహానియా మున్సిపాలిటీలోని 'వెరైటీ టీ వన్ రెస్టారెంట్' మానవ వినియోగానికి అనర్హమైన ఆహారాన్ని అందించినందుకు మార్చి 26నుండి ఐదు రోజుల పాటు మూసివేయాలని ఆదేశించారు.
అల్ షహానియా మున్సిపాలిటీలో ఉన్న 'అల్ వాహిద్ రెస్టారెంట్', ఆరోగ్యం మరియు పరిశుభ్రతా నిబంధనలను ఉల్లంఘించింది. అపరిశుభ్రమైన పరిస్థితుల్లో ఆహారాన్ని తయారు చేసినందుకు గాను మార్చి 10 నుండి మూడు రోజుల పాటు మూసివేయాలని ఆదేశించారు.
ఆహార భద్రతా ప్రమాణాలను అమలు చేయడం, ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం మరియు స్థానిక మార్కెట్లో ఆహార ఉత్పత్తుల నాణ్యతను కాపాడటం లక్ష్యంగా మంత్రిత్వ శాఖ చేపట్టిన నిరంతర తనిఖీ కార్యక్రమాలలో భాగంగా ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రిత్వశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!
- భారత్@80.. సౌదీ అరేబియాతో మరింత బలపడుతున్న భాగస్వామ్యం..!!
- మస్కట్లో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!







