ఖతార్ లో మూడు ప్రముఖ ఆహార సంస్థలు మూసివేత..!!
- March 30, 2026
దోహా: ఖతార్లో ఆహార భద్రతా చట్టాలు మరియు నిబంధనలను ఉల్లంఘించిన మూడు ప్రముఖ ఆహార సంస్థలను తాత్కాలికంగా మూసివేయాలని మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
అల్ షహానియా మున్సిపాలిటీలో ఉన్న 'గోర్ఖా మీట్ ట్రేడింగ్ కంపెనీ' నిబంధనల ప్రకారం లేబులింగ్పై తప్పనిసరిగా ప్రదర్శించాల్సిన సమాచారాన్ని పొందుపరచకుండా ప్యాకేజ్ చేసిన ఆహార ఉత్పత్తులను విక్రయించింది. దీంతో మార్చి 26 నుండి 14 రోజుల పాటు పూర్తిగా మూసివేయాలని ఆదేశించారు.
అల్ షహానియా మున్సిపాలిటీలోని 'వెరైటీ టీ వన్ రెస్టారెంట్' మానవ వినియోగానికి అనర్హమైన ఆహారాన్ని అందించినందుకు మార్చి 26నుండి ఐదు రోజుల పాటు మూసివేయాలని ఆదేశించారు.
అల్ షహానియా మున్సిపాలిటీలో ఉన్న 'అల్ వాహిద్ రెస్టారెంట్', ఆరోగ్యం మరియు పరిశుభ్రతా నిబంధనలను ఉల్లంఘించింది. అపరిశుభ్రమైన పరిస్థితుల్లో ఆహారాన్ని తయారు చేసినందుకు గాను మార్చి 10 నుండి మూడు రోజుల పాటు మూసివేయాలని ఆదేశించారు.
ఆహార భద్రతా ప్రమాణాలను అమలు చేయడం, ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం మరియు స్థానిక మార్కెట్లో ఆహార ఉత్పత్తుల నాణ్యతను కాపాడటం లక్ష్యంగా మంత్రిత్వ శాఖ చేపట్టిన నిరంతర తనిఖీ కార్యక్రమాలలో భాగంగా ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రిత్వశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- తమిళనాడు కొత్త కేబినెట్ ప్రకటించిన విజయ్..ఎవరికి ఏ శాఖ?
- మల్కాజిగిరి కమిషనరేట్లో పోక్సో చట్టం అమలు పై రెండు రోజుల శిక్షణ కార్యక్రమం
- హయాకోమ్.. వరదల ఆందోళనలపై చర్చ..!!
- రియాద్ మెట్రో వెస్ట్రన్ స్టేషన్ ప్రారంభం..!!
- జనన, మరణ రిజిస్ట్రేషన్..వర్కింగ్ అవర్స్ ప్రకటించిన MoPH..!!
- సోషల్ మీడియాలో బంధువు ఫోటోలు పోస్ట్.. Dh3,000 ఫైన్..!!
- యంగ్ లీడర్స్.. మస్కట్ లో జాతీయ కార్యక్రమం ప్రారంభం..!!
- ఫ్లైట్ లో ప్రయాణికుడిని రక్షించిన యూఏఈ నర్సు..!!
- మే 23 నుండి బెంగళూరు–ముంబై కొత్త రైలు ప్రారంభం!
- SRH vs RCB మ్యాచ్ టికెట్ల పేరిట కొత్త సైబర్ దందా.. సీపీ సజ్జనార్ హెచ్చరిక!









