ఖతార్ లో మూడు ప్రముఖ ఆహార సంస్థలు మూసివేత..!!
- March 30, 2026
దోహా: ఖతార్లో ఆహార భద్రతా చట్టాలు మరియు నిబంధనలను ఉల్లంఘించిన మూడు ప్రముఖ ఆహార సంస్థలను తాత్కాలికంగా మూసివేయాలని మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
అల్ షహానియా మున్సిపాలిటీలో ఉన్న 'గోర్ఖా మీట్ ట్రేడింగ్ కంపెనీ' నిబంధనల ప్రకారం లేబులింగ్పై తప్పనిసరిగా ప్రదర్శించాల్సిన సమాచారాన్ని పొందుపరచకుండా ప్యాకేజ్ చేసిన ఆహార ఉత్పత్తులను విక్రయించింది. దీంతో మార్చి 26 నుండి 14 రోజుల పాటు పూర్తిగా మూసివేయాలని ఆదేశించారు.
అల్ షహానియా మున్సిపాలిటీలోని 'వెరైటీ టీ వన్ రెస్టారెంట్' మానవ వినియోగానికి అనర్హమైన ఆహారాన్ని అందించినందుకు మార్చి 26నుండి ఐదు రోజుల పాటు మూసివేయాలని ఆదేశించారు.
అల్ షహానియా మున్సిపాలిటీలో ఉన్న 'అల్ వాహిద్ రెస్టారెంట్', ఆరోగ్యం మరియు పరిశుభ్రతా నిబంధనలను ఉల్లంఘించింది. అపరిశుభ్రమైన పరిస్థితుల్లో ఆహారాన్ని తయారు చేసినందుకు గాను మార్చి 10 నుండి మూడు రోజుల పాటు మూసివేయాలని ఆదేశించారు.
ఆహార భద్రతా ప్రమాణాలను అమలు చేయడం, ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం మరియు స్థానిక మార్కెట్లో ఆహార ఉత్పత్తుల నాణ్యతను కాపాడటం లక్ష్యంగా మంత్రిత్వ శాఖ చేపట్టిన నిరంతర తనిఖీ కార్యక్రమాలలో భాగంగా ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రిత్వశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్
- నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
- రియాద్లో హౌజ్ హోల్డ్ డెమోగ్రాఫిక్ సర్వే ప్రారంభం..!!
- యూఏఈలో ఇంధన ధరలు పెరుగుతాయా?
- బ్రోకరేజ్ సంస్థల పై నియంత్రణ విధించాలని ఎంపీల పిలుపు..!!
- ఒమన్ లో రాబోయే మూడు రోజులపాటు వర్షాలు..!!
- ఖతార్ లో మూడు ప్రముఖ ఆహార సంస్థలు మూసివేత..!!
- పెరంబూర్ నుంచి నామినేషన్ వేసిన దళపతి విజయ్
- కువైట్లో నీటి శుద్ధీకరణ కేంద్రం పై దాడి..భారతీయ కార్మికుడు మృతి









