ఒమన్ లో రాబోయే మూడు రోజులపాటు వర్షాలు..!!
- March 30, 2026
మస్కట్: ఒమన్ లో అల్పపీడన ద్రోణి ప్రభావం కొనసాగుతుందని, దీంతో రాబోయే మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని నేషనల్ మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు మరియు తీవ్రమైన గాలులు వీస్తాయని తెలిపింది. వాడీలు మరియు లోయలలో ఆకస్మిక వరదలు ముంచెత్తుతాయని, అదే సమయంలో విజిబిలిటీ తగ్గే అవకాశం ఉందన్నారు.
ముసందమ్, అల్ బురైమీ, అల్ ధాహిరా, అల్ బతినా నార్త్, అల్ వుస్తా మరియు ధోఫార్ గవర్నరేట్లపై ప్రభావం అధికంగా ఉంటుందని కేంద్రం పేర్కొంది. తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసి లోయలలో వరద నీరు ప్రవహిస్తుందని, అలాగే గంటకు 10 నుండి 20 నాట్ల వేగంతో తేలికపాటి నుండి మోస్తరు గాలులు వీస్తాయని వెల్లడించింది.
ఇక ఏప్రిల్ 1-2తేదీలలో ముసందమ్, అల్ బురైమీ, అల్ ధాహిరా, అల్ బతినా నార్త్, అల్ బతినా సౌత్, మస్కట్, అల్ దఖిలియా, అల్ షర్కియా నార్త్, అల్ షర్కియా సౌత్ మరియు అల్ వుస్తా గవర్నరేట్లలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ప్రకటించారు. గంటకు 15 నుండి 30 నాట్ల (27 నుండి 55 కి.మీ./గంట) వేగంతో బలమైన గాలులు వీయవచ్చని తెలిపారు.
ఒమన్ తీరప్రాంతాలలో మోస్తరు నుండి ఉధృతమైన అలలు ఉండే అవకాశం ఉందని, వీటి గరిష్ట ఎత్తు 2 నుండి 3 మీటర్ల వరకు చేరుతుందన్నారు. అందువల్ల, వర్షాలు కురిసే సమయంలో సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు.
వర్షాల సమయంలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, వరదల వచ్చే ప్రాంతాలకు దూరంగా ఉండాలని, విజిబిలిటీని గమనిస్తూ ఉండాలని, అధికార యంత్రాంగం జారీ చేసిన అధికారిక వాతావరణ ప్రకటనలను ఫాలో కావాలని పౌర విమానయాన అథారిటీ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!
- కువైట్ లో అనధికార వాహన స్టిక్కర్లపై హెచ్చరిక..!!
- సౌక్ వాకిఫ్లో మ్యాంగో ఫెస్టివల్ పునఃప్రారంభం..!!
- రాస్ అల్ ఖైమాలో విషాదం..పరీక్షలకు వెళ్తుండగా టీనేజర్ మృతి..!!
- బహ్రెయిన్ లో భద్రతా తనిఖీల వీడియో చిత్రీకరణ..వ్యక్తి అరెస్ట్..!!
- పవిత్ర కాబాలో వార్షిక వేడుక..ఊద్ నూనె, జమ్జమ్, గులాబీ నీటితో క్లీనింగ్..!!
- 46 ఇంజనీరింగ్ వృత్తులలో 30% సౌదీకరణ..!!
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం







