బ్రోకరేజ్ సంస్థల పై నియంత్రణ విధించాలని ఎంపీల పిలుపు..!!
- March 30, 2026
మనామా: బహ్రెయిన్లోని చిన్న తరహా వాణిజ్య రంగానికి కొత్త నిబంధనలు కోరుతూ ఐదుగురు ఎంపీలు ఒక అత్యవసర ప్రతిపాదన సమర్పించారు. ఇందులో ఆస్తి మరియు కార్ల బ్రోకరేజ్ వంటి వ్యాపారాలను లక్ష్యంగా పలు కీలక ప్రతిపాదనలు చేశారు. అనియంత్రిత బ్రోకరేజ్ సంస్థల పౌరుల ఆదాయాన్ని హరించివేస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఖాలిద్ బువానాఖ్, మహమ్మద్ అల్ మారేఫీ, అహ్మద్ అల్ సల్లూమ్, జైనాబ్ అబ్దుల్ అమీర్ మరియు హిషామ్ అల్ అవధి సమర్పించిన ఈ ప్రతిపాదన, చిన్న తరహా వాణిజ్య కార్యకలాపాల పట్ల ప్రభుత్వం తన విధానాన్ని పునర్ సమీక్షించాలని కోరారు. అలాగే కొన్ని సేవా వ్యాపారాలతో పాటు ఆస్తి మరియు వాహన బ్రోకరేజ్ వంటి రంగాలకు నిబంధనలు తీసుకురావల్సిన అవసరం ఉందన్నారు.
చిన్న ప్రాజెక్టుల మార్కెట్ కోసం ప్రభుత్వ విధానాన్ని మెరుగుపరచాలని, పౌరుల పోటీ సామర్థ్యాన్ని బలోపేతం చేయాలని, మార్కెట్లో అనియంత్రిత పద్ధతులను అరికట్టడమే తమ లక్ష్యమని బువానాఖ్ అన్నారు.
చట్టవిరుద్ధమైన మార్కెట్ కార్యకలాపాలను అరికట్టడానికి తగినన్ని నియమాలు లేకపోవడంతో ఎక్కువ మంది ఇందులోకి ప్రవేశిస్తున్నారని, దీంతో చిన్న బహ్రెయిన్ వ్యాపారులు పోటీ పడటం కష్టంగా ఉందని ఎంపీలు పేర్కొన్నారు. ఇలాంటి ధోరణులు మార్కెట్లోని చిన్న ప్రాజెక్టుల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థలో పౌరుల పాత్రను విస్తృతం చేయడానికి బహ్రెయిన్ చేస్తున్న ప్రయత్నాలకు విరుద్ధంగా ఉందని ఎంపీలు అన్నారు. మార్కెట్లోని చిన్న ప్రాజెక్టులపై ఇప్పటికే ఉన్న ఒత్తిడి ఆ రంగాలలో పనిచేస్తున్న పౌరుల కుటుంబ ఆదాయాన్ని దెబ్బతీస్తున్నందున, తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎంపీలు అన్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!
- భారత్@80.. సౌదీ అరేబియాతో మరింత బలపడుతున్న భాగస్వామ్యం..!!
- మస్కట్లో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!







