సెప్టెంబర్ 15 నుంచి 'బాహుబలి 2' షూటింగ్ ప్రారంభంకానుంది
- July 23, 2015
'బాహుబలి' రెండో భాగం షూటింగ్ సెప్టెంబర్ 15 నుంచి జరగనుందని హీరో ప్రభాస్ తెలిపారు. తమ సెలవులన్ని ముగించుకుని సెప్టెంబర్ 15 చిత్రీకరణలో పాల్గొంటామని చెప్పాడు. రెండోభాగం షూటింగ్ 40 శాతం ఇప్పటికే పూర్తి చేశారు. ప్రధాన పాత్రల మధ్య సన్నివేశాలు చిత్రీకరణ పూర్తయిందని ప్రభాస్ తెలిపారు. యుద్ధం, ఇతర కీలక సన్నివేశాలు షూట్ చేయాల్సి ఉందని వెల్లడించాడు. 'బాహుబలి ది కన్ క్లూజన్' పేరుతో రెండో భాగం తెరకెక్కించనున్నారు. ఇందులో దగ్గుబాటి రానా, తమన్నా, అనుష్క, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ ముఖ్యపాత్రలు పోషించారు. జూలై 10న విడుదలైన 'బాహుబలి' ఫస్ట్ పార్ట్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ఇప్పటి వరకు రూ.350 కోట్లు వసూలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
తాజా వార్తలు
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం









