సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- April 02, 2026
దోహా: ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితుల నేపథ్యంలో అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్ 2వ ఎడిషన్ను సెప్టెంబర్ 7-9కి మార్చినట్టు ఖతార్ రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ ఫోరమ్ను ఏప్రిల్ 7-9 తేదీలలో నిర్వహించాల్సి ఉంది.
జస్ట్ అస్ & ఒట్టో మార్కెటింగ్ సర్వీసెస్ వారు నిర్వహిస్తున్న 2026 ఫోరమ్లో ఆటోనమస్ మరియు ఇ-మొబిలిటీ రంగాలలోని తాజా ఆవిష్కరణలకు ఇది వేదికగా నిలుస్తుంది. స్థానిక, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ వక్తలు, సీనియర్ ప్రభుత్వ అధికారులు, పరిశ్రమ నిపుణులు, ఆవిష్కర్తలు, విద్యావేత్తలు మరియు సామాజిక ప్రముఖులు ఇందులో పాల్గొంటారు. స్మార్ట్ సిటీలలో ఆటోనమస్ వ్యవస్థల పాత్ర, డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఏఐ-ఆధారిత ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాలు ఇందులో భాగంగా ఉంటాయని నిర్వాహకులు ప్రకటించారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







