సెప్టెంబర్‌కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్‌..!!

- April 02, 2026 , by Maagulf
సెప్టెంబర్‌కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్‌..!!

దోహా: ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితుల నేపథ్యంలో అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్ 2వ ఎడిషన్‌ను  సెప్టెంబర్ 7-9కి మార్చినట్టు ఖతార్ రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ ఫోరమ్‌ను ఏప్రిల్ 7-9 తేదీలలో నిర్వహించాల్సి ఉంది. 

జస్ట్ అస్ & ఒట్టో మార్కెటింగ్ సర్వీసెస్ వారు నిర్వహిస్తున్న 2026 ఫోరమ్‌లో ఆటోనమస్ మరియు ఇ-మొబిలిటీ రంగాలలోని తాజా ఆవిష్కరణలకు ఇది వేదికగా నిలుస్తుంది. స్థానిక, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ వక్తలు, సీనియర్ ప్రభుత్వ అధికారులు, పరిశ్రమ నిపుణులు, ఆవిష్కర్తలు, విద్యావేత్తలు మరియు సామాజిక ప్రముఖులు ఇందులో పాల్గొంటారు. స్మార్ట్ సిటీలలో ఆటోనమస్ వ్యవస్థల పాత్ర, డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఏఐ-ఆధారిత ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాలు ఇందులో భాగంగా ఉంటాయని నిర్వాహకులు ప్రకటించారు.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com