బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- April 03, 2026
మనామా: పర్యాటక పరిశ్రమ ప్రమాణాలను క్రమబద్ధీకరించడం లక్ష్యంగా కఠినమైన నిబంధనలను ప్రవేశపెట్టే దిశగా బహ్రెయిన్ అడుగులు వేస్తున్నది. ఇప్పడు టూర్ గైడింగ్ రంగానికి పౌరులే నాయకత్వం వహిస్తున్నారని ఎంపీ డాక్టర్ మహదీ అబ్దుల్ అజీజ్ అల్ షువైఖ్ ఆడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో తెలియజేశారు. బహ్రెయిన్లో 74 మంది లైసెన్స్ పొందిన టూర్ గైడ్లు ఉన్నారని పర్యాటక మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. వీరిలో 53 మంది బహ్రెయిన్ దేశస్థులు, ఇది మొత్తం సిబ్బందిలో సుమారు 72 శాతానికి సమానంగా ఉంది.
బహ్రెయిన్ సంస్కృతి, వారసత్వం మరియు చారిత్రక ప్రదేశాలను సందర్శకులకు తెలియజేయడంలో కీలక పాత్ర పోషించే ఈ వృత్తిలో, స్థానిక ప్రతిభను అభివృద్ధి చేయడంపై పెరుగుతున్న ప్రాధాన్యతను ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
పర్యాటక మంత్రిత్వ శాఖ తెలిపిన ప్రకారం..పర్యటనలను నిర్వహించేటప్పుడు ప్రయాణ మరియు పర్యాటక సంస్థలు తప్పనిసరిగా లైసెన్స్ పొందిన గైడ్లతో ఒప్పందం చేసుకోవాలి. తద్వారా పర్యాటకులు రాజ్యంలోని చారిత్రక మరియు సాంస్కృతిక ప్రదేశాల గురించి కచ్చితమైన సమాచారాన్ని పొందవచ్చని తెలిపారు.
బహ్రెయిన్ పర్యాటక మరియు ప్రదర్శనల అథారిటీతో సమన్వయంతో సిద్ధం చేసిన ఒక ముసాయిదా నియంత్రణ నిర్ణయం.. పర్యాటక సంస్థలు లైసెన్స్ లేని గైడ్లతో పనిచేయడాన్ని నిషేధిస్తుందని అధికారులు వెల్లడించారు.
2022–2026 సంవత్సరాలకు బహ్రెయిన్ పర్యాటక రంగంలో టూర్ గైడింగ్ ఒక ప్రధాన విభాగంగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా వారసత్వ మరియు సాంస్కృతిక పర్యాటక రంగంలో సందర్శకులకు ప్రామాణికమైన సమాచారాన్ని అందించడంలో అర్హత కలిగిన గైడ్లు అత్యవసరం అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సలాలాకు ఎతిహాద్ ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు ప్రారంభం
- APSFTVTDCకు కొత్త పాలకవర్గం నియామకం
- IPL 2026: కోహ్లీ తర్వాత గిల్.. టీ20ల్లో కొత్త రికార్డు!
- అమెరికా-క్యూబా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు..
- మే 28న బక్రీద్ సెలవు: ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ సాయి ప్రసాద్
- ఈద్ అల్ అధా సందర్భంగా 836 మంది ఖైదీలకు షేక్ మొహమ్మద్ క్షమాభిక్ష
- తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ ఏపీ పర్యటన విజయవంతం
- సరస్వతీ అంత్య పుష్కరాల్లో గవర్నర్ దంపతుల పుణ్యస్నానం
- ఆన్లైన్లో పోస్ట్ చేసే ముందు తెలుసుకోవాల్సిన యూఏఈ 10 కీలక మీడియా చట్టాలు
- ఏపీలో పర్యటిస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై కమిటీ









