పసిడి ధర తగ్గింది..
- August 04, 2016
వరుసగా రెండు రోజులుగా పెరుగుతున్న బంగారం ధర ఈరోజు రూ.200 తగ్గింది. నేటి బులియన్ మార్కెట్లో పది గ్రాముల పసిడి ధర రూ.200 తగ్గి రూ.31,050కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గడంతో పాటు, దేశీయ మార్కెట్లో నగల వ్యాపారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో ధర తగ్గినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. సింగపూర్లో ఔన్స్ బంగారం ధర 0.4 శాతం తగ్గి 1,352.48 అమెరికా డాలర్లకు చేరింది.బంగారం బాటలోనే వెండి ధర కూడా తగ్గి రూ. 47వేల దిగువకు పడిపోయింది. ఈరోజు డిమాండ్ లేమితో కిలో వెండి ధర రూ.870 తగ్గి రూ.46,950కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో వెండి ధర తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా డిమాండ్ తగ్గడంతో సింగపూర్లో ఔన్సు వెండి ధర 1.13శాతం తగ్గి 20.15 అమెరికా డాలర్లకు చేరింది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







