చైనాలో బోయింగ్ 737 రెస్టారెంట్
- August 04, 2016
చైనాలో ఉహాన్ ప్రాంతానికి చెందిన లీ లియాంగ్ అనే వ్యాపార వేత్త బోయింగ్737 విమానాన్ని రెస్టారెంట్గా మార్చేశాడు. దేశంలో మొట్ట మొదటి విమాన రెస్టారెంట్ అయిన లిల్లీ ఎయిర్వేస్ని ఇటీవలే ప్రారంభించారు. ఇందులో విమానంలో కూర్చున్న అనుభూతినిచ్చే సిములేటర్, బయట పిల్లలు ఆడుకోవడానికి పలు రైడ్స్ కూడా ఏర్పాటు చేశారు.
ఇండోనేషియా ఎయిర్లైన్స్ అయిన బటావియాఎయిర్ విమానయాన సంస్థ నుంచి 5 మిలియన్ యువాన్లు ఖర్చు పెట్టి విమానాన్ని కొనుగోలు చేసి చైనా తెప్పించాడు లియాంగ్. కస్టమ్స్ నియమాలన్నీ పాటించి అది చైనా చేరుకునేసరికి 6 నెలల కాలం పట్టిందట. ఇండోనేషియా నుంచి చైనా చేరుకునే క్రమంలో 8 సార్లు భాగాలుగా విడగొట్టి మళ్లీ అమర్చారట. భాగాలుగా విడగొట్టి 70 కంటైనర్లలో ఆ భాగాలను ఉంచి దఫ దఫాలుగా ఓడపై తీసుకురావడానికి మరో 3 మిలియన్ల యువాన్లు ఖర్చు చేశాడట. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ఖరీదైన రెస్టారెంట్ల సరసన ఈ లిల్లీ ఎయిర్వేస్ రెస్టారెంట్ కూడా చేరింది.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







