సార్క్ సమావేశాల్లో రాజ్ నాథ్ సింగ్ ప్రసంగం ప్రసారానికి పాకిస్తాన్ అడ్డు
- August 04, 2016
సార్క్ సమావేశాల్లో హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రసంగం ప్రసారం కాకుండా పాకిస్తాన్ అడ్డుకుంది. ఆయన ప్రసంగాన్ని ప్రసారం చేయడానికి పాకిస్తాన్ ప్రైవేటు మీడియా, భారత్ మీడియాకు కూడా అనుమతినివ్వలేదు. సార్క్ సమావేశాల్లో రాజ్నాథ్ మాట్లాడుతూ.. ఉగ్రవాదంపై గట్టి వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదానికి మద్దతుగా ఉన్న దేశాలపై కఠినంగా వ్యవహరించాలని ఆయన కోరారు.
టెర్రిరిస్టులను అమరవీరులుగా పేర్కొనకూడదని రాజ్ నాథ్ సూచించారు. మంచి టెర్రరిజం, చెడు టెర్రరిజం అనే భేదాలు లేవని.. టెర్రరిజం టెర్రరిజమేనని అన్నారు. డిజిటల్ టెక్నాలజీని సరిగా ఉపయోగించలేకపోవడం వల్లే టెర్రరిజం పెరుగుతూ పోతోందని వ్యాఖ్యానించారు. కాగా, సార్క్ సమావేశానికి హజరైన పాకిస్తాన్ మంత్రి చౌదరి నసీర్ అలీ ఖాన్ తో రాజ్నాథ్ కరచాలనం మాత్రమే చేశారు. అంతకుముందు ఇస్లామాబాద్ లో సెరెనా హోటల్ జరిగిన ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న మంత్రులను ఆహ్వానించేందుకు ఖాన్ గుమ్మం బయట నిలబడ్డారు. రాజ్ నాథ్ హోటల్ లోకి వెళ్లేటప్పుడు ఆయన కరచాలనంతో సరిపెట్టారు. మధ్యాహ్నం జరిగిన విందుకు కూడా ఇద్దరు నేతలు హాజరుకాలేదు. సార్క్ సమావేశం పూర్తి కావడంతో రాజ్ నాథ్ తిరిగి భారత్ కు పయనమయ్యారు. సార్క్ సమావేశంలో రాజ్ నాథ్ ప్రసంగాన్ని ప్రసారం చేసేందుకు వెళ్లిన మీడియాను అడ్డుకోవడంతోనే పాకిస్తాన్ ఎంతటి ప్రజాస్వామ్య దేశమో అర్ధమవుతుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







