కొత్తగా ఐదు ఐపీ ఇ-సేవలను ప్రారంభించిన ఖతార్..!!
- April 06, 2026
దోహా: ఖతార్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) ఐదు కొత్త ఇంటలెక్చువల్ ప్రాపర్టీ (IP) ఇ-సేవలను ప్రారంభించినట్లు ప్రకటించింది. దీనితో ఈ రంగంలో అందించే డిజిటల్ సేవల మొత్తం సంఖ్య ఏడుకు చేరింది. లబ్ధిదారులకు అందించే సేవల మొత్తం నాణ్యతను మెరుగుపరచడం కోసం మంత్రిత్వ శాఖ విస్తృత వ్యూహంలో ఈ చొరవ ఒక భాగమని తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ లో ప్రకటించింది.
కొత్తగా ప్రవేశపెట్టిన ఈ సేవలు కాపీరైట్ మరియు అనుబంధ హక్కులకు సంబంధించిన ప్రక్రియలను సులభతరం చేయడానికి మరియు వేగవంతం చేయడానికి రూపొందించబడ్డాయి. వీటిలో కాపీరైట్ రిజిస్ట్రేషన్ మరియు డిపాజిట్ సర్టిఫికేట్ల కోసం దరఖాస్తులు, సర్టిఫికేట్ల జారీ, సవరణలు వంటివి ఉన్నాయి. ఈ సేవలను ఆన్లైన్ లో అందించడం ద్వారా పేపర్ పనిని తగ్గించడం, ప్రాసెసింగ్ సమయాలను తగ్గించడం, వినియోగదారులకు మరింత సులభమైన, అందుబాటులో ఉండే అనుభవాన్ని అందించడం లక్ష్యమని పేర్కొంది.
ఈ సేవలు కవులు, పరిశోధకులు, రచయితలు, సంగీతకారులు, కళాకారులు, డిజైనర్లు, వాస్తుశిల్పులు, మరియు సాఫ్ట్వేర్ డెవలపర్లతో సహా విస్తృత శ్రేణి లబ్ధిదారులకు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు వివిధ రంగాలలో సృజనాత్మకత, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, మేధో సంపత్తిని పరిరక్షించడానికి దోహద పడుతుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇక డిజిటల్ సామర్థ్యాన్ని మరింత పెంచే సమాంతర ప్రయత్నంలో భాగంగా, మంత్రిత్వశాఖ తన ప్లాట్ఫారమ్ ద్వారా వస్తువుల ధరలను నమోదు చేయడానికి మొదటిసారిగా ఒక కొత్త ఎలక్ట్రానిక్ ప్రక్రియను కూడా వివరించింది. వేగవంతమైన మరియు కచ్చితమైన డేటా ఎంట్రీతో, ఈ ప్లాట్ఫారమ్ సమాచారం సమర్థవంతంగా ప్రాసెస్ చేయడానికి సహాయపడుతుందన్నారు.
తాజా వార్తలు
- ఒకే ఫోన్ కాల్తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కొత్తగా ఐదు ఐపీ ఇ-సేవలను ప్రారంభించిన ఖతార్..!!
- కువైట్ లో వాటిని వీడియో తీసిన 29 మంది అరెస్టు..!!
- బాసర ఆలయాభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమిపూజ |
- ఖతార్ ప్రధానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్
- ఏప్రిల్ 10 నుంచి యూపీఐ తప్పనిసరి
- తారామతి బారాదరిలో ‘మోర్ దేన్ ఫ్రెండ్స్’ పార్టీ పై ఈగల్ పోలీసుల దాడులు









