కువైట్ లో వాటిని వీడియో తీసిన 29 మంది అరెస్టు..!!
- April 06, 2026
కువైట్: ఇటీవల ఇరాన్ దారుణ దురాక్రమణకు గురైన ఒక కీలక ప్రదేశాన్ని ఫోటోలు/వీడియోలు తీసిన ఆరోపణలపై ఆరుగురు పౌరులు, 23 మంది ప్రవాసులతో సహా 29 మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వారిపై చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించినట్లు తెలిపింది. ముఖ్యంగా సున్నితమైన ప్రదేశాల చుట్టూ ఉల్లంఘనలను పర్యవేక్షించడానికి చేపట్టిన భద్రతా ప్రయత్నాలలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది.
గత శుక్రవారం దేశవ్యాప్త తనిఖీ ప్రచారాల సందర్భంగా ట్రాఫిక్ అధికారులు మొత్తం 2,327 ఉల్లంఘనలను నమోదు చేశారు. నివాస నిబంధనల ఉల్లంఘనలకు గాను 22 మంది ప్రవాసులను, అలాగే అరెస్టు వారెంట్లపై తప్పించుకు తిరుగుతున్న వారిని కూడా అరెస్టు చేసినట్లు పేర్కొంది. అలాగే, చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
ఇక వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ వాడినందుకు 79 కేసులు, సీట్ బెల్టులు పెట్టుకోనందుకు 44 కేసులు, కిటికీలకు చట్టవిరుద్ధంగా టింటింగ్ చేసినందుకు 43 కేసులు నమోదు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..







