హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- April 06, 2026
మస్కట్: ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి గుండా రాకపోకలకు సంబంధించి ఒమన్- ఇరాన్ చర్చించాయి. ఇరు దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖల అండర్-సెక్రటరీల స్థాయిలో ఒక సమావేశాన్ని నిర్వహించారు. హోర్ముజ్ గుండా రాకపోకలను ప్రారంభించేందుకు గల సాధ్యమైన మార్గాలను పరిశీలించారు. ఈ విషయమై ఇరుదేశాలకు చెందిన నిపుణులు పలు ప్రతిపాదనలను సమర్పించారు.
అలాగే, సిరియా రాజధాని డమాస్కస్లోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయబార కార్యాలయంపై జరిగిన దాడులను ఒమన్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడి అంతర్జాతీయ దౌత్య నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘించడమే కాక, దౌత్య కార్యాలయాల అభేద్యతకు మరియు వాటి సిబ్బంది భద్రతకు హామీ ఇచ్చే ఒప్పందాలను కూడా అతిక్రమించడమేనని ఒమన్ పేర్కొంది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!









