ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు ముహూర్తం ఫిక్స్
- April 06, 2026
తెలంగాణలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు పై రేవంత్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. వరంగల్ మామునూరు ఎయిర్పోర్టు పనులు ఇప్పటికే ఊపందుకోగా, తాజాగా ఆదిలాబాద్ కొత్త ఎయిర్పోర్టు నిర్మాణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆదిలాబాద్ జిల్లా పిప్రి గ్రామంలో జరిగిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ బహిరంగ సభలో పాల్గొన్న సీఎం, జిల్లా అభివృద్ధి పై వరాల జల్లు కురిపించారు.
ఆదిలాబాద్ ప్రజల చిరకాల కోరికైన విమానాశ్రయ నిర్మాణంపై సీఎం సానుకూలంగా స్పందించారు. “కొత్త ఎయిర్పోర్టు అంశంపై ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, రాజ్నాథ్ సింగ్లతో చర్చించాం. వీలైతే జూన్ 2వ తేదీ లోపు ఆదిలాబాద్ ఎయిర్పోర్టు నిర్మాణానికి శిలాఫలకం వేసే బాధ్యత నేను తీసుకుంటా” అని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ఎయిర్పోర్టుతో పాటు ఆదిలాబాద్ ప్రాంతాన్ని గొప్ప పారిశ్రామిక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం. దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడను ఆదిలాబాద్కు మంజూరు చేసి ఇక్కడి ఆదివాసీలకు ఉపాధి మార్గాలు చూపిస్తాం. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. దానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఆదిలాబాద్లో యూనివర్సిటీ కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్కు కొత్త యూనివర్సిటీ ఇస్తాం. త్వరలోనే దాని ప్రారంభోత్సవం ఉంటుంది.’ అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన కువైట్ విదేశాంగ మంత్రి
- ఏపీ రాజధానిగా అమరావతి ఖరారు..కేంద్రం అధికారిక గెజిట్ విడుదల
- ఒక్క రాత్రిలోనే తుడిచిపెట్టేస్తాం: డోనాల్డ్ ట్రంప్
- విశాఖలో డేటా సెంటర్ శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్
- ఏపీలో విచిత్ర వాతవరణం: మండుతున్న ఎండలు.. కురుస్తున్న వర్షాలు
- ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు ముహూర్తం ఫిక్స్
- ఒకే ఫోన్ కాల్తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!









