కాల్పుల విరమణ.. యూఏఈ ట్రావెల్ ఏజెన్సీలకు భారీగా పెరిగిన విచారణలు..!!
- April 09, 2026
యూఏఈ: అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధానికి రెండు వారాల కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో.. యూఏఈ ట్రావెల్ ఆపరేటర్లు ప్రయాణ విచారణలు మరియు వీసా దరఖాస్తుల సంఖ్యలో పెరుగుదలను చూస్తున్నారు. అయితే, ప్రయాణ ప్రణాళికలపై ఈ నిర్ణయం వాస్తవ ప్రభావం రాబోయే రోజుల్లోనే స్పష్టమవుతుందని చాలామంది ఏజెంట్లు చెబుతున్నారు.
ప్రాంతీయ ఉద్రిక్తతలు మొదలైన గత కొన్ని వారాలతో పోలిస్తే, ఈ రోజు ఉదయం నుండి తనకు పర్యాటక వీసా దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని తాహిరా ట్రావెల్స్కు చెందిన ఫిరోజ్ అన్నారు. చాలా మంది యూఏఈకి త్వరగా రావాలని ఆత్రుతగా ఉన్నందున, తమ వీసాలను ఎంత వేగంగా ప్రాసెస్ చేయాలని అడుగుతున్నారని తెలిపాడు.
పర్యాటకులు, వ్యాపార ప్రయాణికుల రాకకు ఇది ఒక సానుకూల సంకేతమని ఆయన అన్నారు. విచారణలు పెరిగినప్పటికీ, చాలామంది వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారని ఇతర ట్రావెల్ ఆపరేటర్లు తెలిపారు. కాల్పుల విరమణ వార్త వెలువడినప్పటి నుండి ఉదయం నుంచి తమ కంపెనీకి అనేక కాల్స్ వచ్చాయని స్మార్ట్ ట్రావెల్స్ జనరల్ మేనేజర్ సఫీర్ మహమ్మద్ అన్నారు.
ముసాఫిర్.కామ్ సీఈఓ రహీష్ బాబు మాట్లాడుతూ..ట్రావెల్ ఏజెంట్లు విమానయాన సంస్థలు మరియు విమానాశ్రయాల నుండి మరింత సమాచారం కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. "రాబోయే ఒకటి రెండు రోజుల్లో, విమానాలు ఎప్పుడు తమ సాధారణ షెడ్యూళ్లను పునఃప్రారంభిస్తాయనే దానిపై మనకు మరింత స్పష్టత వస్తుందని నేను భావిస్తున్నాను.” అని తెలిపారు.
సాధారణ ఆందోళనలు
నిపుణుల ప్రకారం, ప్రయాణం చేయాలనుకునే వారిలో కొన్ని సాధారణ ఆందోళనలను గమనించారు. "చాలా మంది విజిట్ వీసాపై యూఏఈలో ఉన్నారు, కానీ వారి వీసాల గడువు ముగిసింది." అని సఫీర్ అన్నారు. యూఏఈ ప్రభుత్వం మానవతా దృక్పథంతో వారికి మినహాయింపు ఇచ్చిన వారిలో చాలా మంది టిక్కెట్ ధరలు సాధారణ స్థాయికి రావడానికి వేచి చూస్తున్నారని తెలిపారు. ఇప్పుడు కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినందున, ఆ మినహాయింపు రద్దు చేశారా అని విచారిస్తూ చాలా ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపారు.
భారతదేశంలో ఏప్రిల్-మే నెలలు పాఠశాలలకు సెలవుల సమయం కావడంతో, చాలా మంది నిపుణులు ఈ సమయంలో తమ కుటుంబాలను యూఏఈకి తీసుకువస్తారని రహీష్ తెలిపారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







