విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు.. ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు

- April 09, 2026 , by Maagulf
విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు.. ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు

హైదరాబాద్: కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులను సక్రమంగా వినియోగించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పలు కంపెనీల ప్రతినిధులతో ఆయన బుధవారం సమావేశమయ్యారు. విద్యాభివృద్ధికి రహేజా, రాంకీ గ్రూప్లు చెరో రూ.50 కోట్లు, యశోద ఫౌండేషన్ రూ.10 కోట్లు ఇచ్చేందుకు ముందుకొచ్చాయని సీఎం వెల్లడించారు. ఈ సీఎస్ఆర్ నిధుల సమన్వయానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని నియమించిందని చెప్పారు. విద్య, వైద్యం, పర్యావరణం వంటి ఏ రంగంలోనైనా సంస్థలు నిధులను వెచ్చించవచ్చని స్పష్టం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com