భారతదేశంలోని 9 నగరాలకు జజీరా విమాన సర్వీసుల తాత్కాలిక రద్దు
- April 09, 2026
కువైట్ సిటీ: నిర్వహణ పరమైన కారణాల వల్ల భారతదేశంలోని తొమ్మిది ప్రధాన నగరాలకు తమ విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు Jazeera Airways ప్రకటించింది. ఏప్రిల్ 10 నుంచి మే 15 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని సంస్థ వెల్లడించింది.
రద్దు చేసిన నగరాల్లో విజయవాడ, కోయంబత్తూర్, గోవా, కన్నూర్, కోజికోడ్, లక్నో, మధురై, మంగళూరు, తిరుచిరాపల్లి ఉన్నాయి. ఈ మార్గాల్లో ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు పూర్తి నగదు రీఫండ్ అందజేస్తామని సంస్థ తెలిపింది. ట్రావెల్ ఏజెంట్ల ద్వారా బుకింగ్ చేసిన వారికి అదే మొత్తాన్ని ‘క్రెడిట్ షెల్’ రూపంలో జమ చేయనున్నట్లు పేర్కొంది.
ఈ రద్దు వల్ల ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి జజీరా ఎయిర్వేస్ సీఈఓ భరతన్ పశుపతి క్షమాపణలు తెలిపారు. తమ నియంత్రణలో లేని పరిస్థితుల కారణంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. అయితే దమ్మామ్ కేంద్రంగా భారతదేశంలోని ఇతర ఎనిమిది నగరాలకు విమాన సర్వీసులు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు.
ఇటీవలి ప్రాంతీయ పరిణామాల ప్రభావంతో కువైట్ నుంచి విమాన కార్యకలాపాల్లో కొన్ని అంతరాయాలు ఏర్పడిన నేపథ్యంలో, ప్రయాణికులు తమ ప్రయాణ వివరాల కోసం ఎయిర్లైన్ అధికారిక వెబ్సైట్ లేదా ట్రావెల్ ఏజెంట్లను సంప్రదించాలని సంస్థ సూచించింది.
తాజా వార్తలు
- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్!
- సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ
- అభిజీత్ దిప్కే పై దాడి..
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!









