రాత్రి నేపథ్యంలో మహేష్బాబుపై ఓ పోరాట సన్నివేశo..
- August 04, 2016
మ హేష్బాబు కథానాయకుడిగా మురుగదాస్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్ప్రీత్ సింగ్ కథానాయిక. ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ నిర్మాతలు. ప్రముఖ దర్శకుడు ఎస్.జె.సూర్య ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతోంది. రాత్రి నేపథ్యంలో మహేష్బాబుపై ఓ పోరాట సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు. రాత్రి 8 గంటలకు మొదలై... తెల్లవారుఝామున 4 గంటల వరకూ నిరాటంకంగా చిత్రీకరణ జరుగుతోంది. ఈ పోరాట ఘట్టానికి అనల్ అరసు నేతృత్వం వహిస్తున్నారు. ఈ నెల 12 వరకూ ఇక్కడే షూటింగ్ నిర్వహిస్తారు. చెన్నైలోనూ కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించే చిత్రమిది. ఈ నెల 9న మహేష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్లుక్ విడుదల చేసే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







