ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్యను వంద కోట్లకు చేర్చాలని గూగుల్ లక్ష్యం..
- August 04, 2016
భారత్లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్యను వంద కోట్లకు చేర్చాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు గూగుల్ సంస్థ గురువారం ప్రకటించింది. ఈ విషయాన్ని గూగుల్ ఆగ్నేయ ఆసియా, భారత్ల వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ ముంబైలో వెల్లడించారు. అయితే ఎప్పటిలోపు దీన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారో మాత్రం ఆయన చెప్పలేదు.ప్రస్తుతం భారతదేశంలో ఇంటర్నెట్ను వినియోగించేవారు 35 కోట్లు ఉన్నారనీ ప్రకటించారు. 2020 నాటికి 60 కోట్లకు చేరవచ్చనే అంచనాలున్నాయని ఆనందన్ పేర్కొన్నారు. ఇంటర్నెట్ను ప్రజలకు మరింత చవకగా, అందరికీ అందుబాటులోకి తెస్తేనే ఈ లక్ష్యాన్ని సాధించగలమని ఆయన వివరిం చారు. రైల్టెల్ భాగస్వామ్యంతో ఇప్పటికే గూగుల్ దేశంలోని 27 రైల్వే స్టేషన్లలో అందిస్తున్న ఉచిత వైఫై సౌకర్యాన్ని ఈ సందర్భంగా ఆనందన్ ఉదహరించారు.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









