24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- April 12, 2026
మనామా: జాతీయ ఆహార సరఫరాలను పరిరక్షించడానికి మరియు నిత్యావసర వస్తువుల లభ్యతను నిర్ధారించడానికి బహ్రెయిన్ 24-గంటల ఆపరేషన్స్ రూమ్ను ప్రారంభించింది. ఈ మేరకు ఎంపీ హసన్ ఇబ్రహీం ప్రశ్నకు సమాధానంగా పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ అడెల్ ఫఖ్రో పార్లమెంటుకు తెలిపారు.
వాణిజ్య మార్గాలను ప్రభావితం చేస్తున్న ప్రాంతీయ ఉద్రిక్తతలు ఇంకా ఉన్నప్పటికీ, స్థానిక డిమాండ్ను తీర్చడానికి నిత్యావసర ఫుడ్ స్టాక్ సరిపోతుందని ఆయన అన్నారు.
ధరల పర్యవేక్షణ
అన్యాయమైన ధరల పెంపును నిరోధించడానికి మంత్రిత్వ శాఖ తనిఖీలను ముమ్మరం చేసింది. చట్టాలు, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటోంది. ధరల పెంపునకు గాను అధికారులు నాలుగు వ్యాపార సంస్థలను మూసివేశారు. ఒక కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్కు నివేదించగా, ఇతరులకు హెచ్చరికలు జారీ చేసి, వారి ధరలను సరిదిద్దుకోవాలని ఆదేశించారు.
నిరంతరం తనిఖీ బృందాలు మార్కెట్లు, షాప్స్, వేర్ హౌజ్ లు మరియు సఫ్లై సెంటర్లలో ప్రతిరోజూ తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా ఇన్వాయిస్లు, సఫ్లై చైన్స్ మరియు ఖర్చులను సమీక్షిస్తున్నాయి.
24/7 పర్యవేక్షణ వ్యవస్థ
లాజిస్టిక్స్ ను వేగవంతం చేయడానికి, కీలక సరఫరాదారుల కోసం సంధాన అధికారులతో పాటు, 24 గంటలూ పనిచేసే ఒక ఆపరేషన్స్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. స్థానిక ఆహార ఉత్పత్తిని బలోపేతం చేయడానికి మంత్రిత్వ శాఖ ఆర్థిక అభివృద్ధి బోర్డుతో కలిసి పనిచేస్తూనే, ప్రాంతీయ సఫ్లై చైన్స్ ను సురక్షితం చేయడానికి GCC భాగస్వాములతో సహకరిస్తోందని మంత్రి ఫఖ్రో వెల్లడించారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్







