బహ్రెయిన్ పోస్ట్ నుంచి రెండు కొత్త స్టాంపులు
- August 05, 2016
మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ మరియు టెలికమ్యూనికేషన్స్ (ఎంటిటి) బహ్రెయిన్ పోస్ట్ రెండు కొత్త స్టాంపులను అరబ్ పోస్టల్ డే సందర్భంగా విడుదల చేసింది. అరబ్ దేశాలతో కలిసి పోస్టల్ సెక్టార్లో గణనీయమైన అభివృద్ధికి ఆస్కారం ఉందని ఈ సందర్భంగా బహ్రెయిన్ పోస్ట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. బహ్రెయిన్ పోస్ట్, మినిస్ట్రీకి చెందిన అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ షేక్ బాదర్ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా మాట్లాడుతూ, బహ్రెయిన్ కింగ్డమ్ తాలూకు చరిత్ర, సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు బహ్రెయిన్ పోస్ట్ తనవంతుగా కృషి చేస్తుందనీ, అలాగే ముఖ్యమైన ఈవెంట్స్కి మరింత ప్రాచుర్యం తీసుకొచ్చేందుకు ఇలాంటి వేదికల్ని వినియోగించుకుంటామని అన్నారు. బహ్రెయిన్ పోస్ట్, కమ్యూనికేషన్ విభాగంలో ముఖ్య భూమిక పోషిస్తోందని ఆయన అన్నారు. 200 మరియు 300 ఫిల్స్ , 30 మరియు 40 సైజులో స్టాంప్స్ అందుబాటులో ఉంటాయనీ, షీట్ 750 ఫిల్స్కి లభ్యమవుతుందనీ, ఇవన్నీ బహ్రెయిన్ పోస్ట్ బ్రాంచ్లలో పొందవచ్చని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







