బహ్రెయిన్ పోస్ట్ నుంచి రెండు కొత్త స్టాంపులు
- August 05, 2016
మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ మరియు టెలికమ్యూనికేషన్స్ (ఎంటిటి) బహ్రెయిన్ పోస్ట్ రెండు కొత్త స్టాంపులను అరబ్ పోస్టల్ డే సందర్భంగా విడుదల చేసింది. అరబ్ దేశాలతో కలిసి పోస్టల్ సెక్టార్లో గణనీయమైన అభివృద్ధికి ఆస్కారం ఉందని ఈ సందర్భంగా బహ్రెయిన్ పోస్ట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. బహ్రెయిన్ పోస్ట్, మినిస్ట్రీకి చెందిన అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ షేక్ బాదర్ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా మాట్లాడుతూ, బహ్రెయిన్ కింగ్డమ్ తాలూకు చరిత్ర, సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు బహ్రెయిన్ పోస్ట్ తనవంతుగా కృషి చేస్తుందనీ, అలాగే ముఖ్యమైన ఈవెంట్స్కి మరింత ప్రాచుర్యం తీసుకొచ్చేందుకు ఇలాంటి వేదికల్ని వినియోగించుకుంటామని అన్నారు. బహ్రెయిన్ పోస్ట్, కమ్యూనికేషన్ విభాగంలో ముఖ్య భూమిక పోషిస్తోందని ఆయన అన్నారు. 200 మరియు 300 ఫిల్స్ , 30 మరియు 40 సైజులో స్టాంప్స్ అందుబాటులో ఉంటాయనీ, షీట్ 750 ఫిల్స్కి లభ్యమవుతుందనీ, ఇవన్నీ బహ్రెయిన్ పోస్ట్ బ్రాంచ్లలో పొందవచ్చని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









