బీబీఎన్ ఆధ్వర్యంలో హైల్లో ఇండియన్ కమ్యూనిటీ డిన్నర్ మీట్ ఘన విజయం
- April 14, 2026
హైల్: భారత్ బిజినెస్ నెట్వర్క్ (BBN) ఆధ్వర్యంలో హైల్ నగరంలో నిర్వహించిన ఇండియన్ కమ్యూనిటీ డిన్నర్ మీట్ ఉత్సాహభరిత వాతావరణంలో ఘన విజయవంతంగా ముగిసింది. భారతీయ కమ్యూనిటీ సభ్యులు, వారి కుటుంబాలు, స్నేహితులు, వ్యాపార భాగస్వాములు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సమావేశం ఆత్మీయ పరిచయాలు, స్నేహపూర్వక సంభాషణలు, అర్థవంతమైన చర్చలు, నెట్వర్కింగ్ అవకాశాలతో స్మరణీయ సాయంత్రంగా నిలిచిందని ముంబైకు చెందిన అరవింద్ కుమార్ తెలిపారు. ముఖ్యంగా హైల్ ప్రాంతంలో నివసిస్తున్న భారతీయుల మధ్య ఐక్యతా భావాన్ని మరింత బలోపేతం చేసిన వేదికగా ఈ కార్యక్రమం నిలిచిందన్నారు.
పరస్పర సహకారం, వ్యాపార నెట్వర్కింగ్, భవిష్యత్ అభివృద్ధి అవకాశాలపై పాల్గొన్నవారు సానుకూల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అనంతపురానికి చెందిన గ్లోబల్ తెలుగు GTO అధ్యక్షులు షౌకత్ అలీ మాట్లాడుతూ, హైల్లో భారతీయ సమాజం పెరుగుతున్న బలం, ఐక్యత, సాంస్కృతిక అనుబంధం మరియు పరస్పర సహకారానికి ఈ కార్యక్రమం ప్రతిబింబంగా నిలిచిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన సోషల్ సర్వీస్ వారియర్, ఎంబసీ వాలంటీర్ చాన్సా రహమాన్, హైల్ GIO అధ్యక్షులు సుబ్రహ్మణ్యం,వెంకటేష్ (భగ్గేశ్వరం, ఆంధ్రప్రదేశ్), డాక్టర్ వంశీ (ఒంగోలు), హైల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, అలాగే వెనుక నుంచి సహకరించిన ప్రతి వాలంటీర్కు నిర్వాహకులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (SATA), గ్లోబల్ ఇండియన్ ఓవర్సీస్ (GIO), భారత్ బిజినెస్ నెట్వర్క్ (BBN) వ్యవస్థాపక అధ్యక్షులు మల్లెశన్ మాట్లాడుతూ, కార్యక్రమానికి హాజరై మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇటువంటి సమావేశాలు కమ్యూనిటీ బంధాలను మరింత బలోపేతం చేసి, భవిష్యత్ సహకారాలకు బలమైన వేదికగా నిలుస్తాయని అన్నారు.
భవిష్యత్తులో హైల్లో భారతీయ సమాజం మరిన్ని ప్రయోజనకరమైన, విజయవంతమైన కార్యక్రమాలను నిర్వహించాలని పాల్గొన్నవారు ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- కువైట్లో T5 టెర్మినల్ పునఃప్రారంభం పై సోషల్ మీడియాలో వైరల్ వార్తలు ఫేక్: DGCA స్పష్టీకరణ
- IPL 2026: కోల్కతా పై చెన్నై ఘన విజయం
- దోహాలో ఘనంగా డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు
- శంషాబాద్లో నకిలీ CISF అధికారి గుట్టురట్టు!
- ఏప్రిల్ 15 నుంచి కొత్త జరిమానా నిబంధనలు అమలు
- ట్రంప్తో 40 నిమిషాలు మాట్లాడిన ప్రధాని మోదీ..
- బిహార్ కొత్త సీఎం గా సామ్రాట్ చౌదరి..!
- భారత్ లో ‘టెక్నోవర్స్ హ్యాకథాన్ 2026’ ప్రారంభం!
- తెలంగాణలో వీఐపీ సెక్యూరిటీ తగ్గింపు: డీజీపీ శివధర్రెడ్డి
- ఛత్తీస్ గఢ్ లోని వేదాంత పవర్ ప్లాంట్లో భారీ పేలుడు, 9 మంది మృతి









