తెలంగాణలో వీఐపీ సెక్యూరిటీ తగ్గింపు: డీజీపీ శివధర్రెడ్డి
- April 14, 2026
హైదరాబాద్: తెలంగాణ ఇప్పుడు మావోయిస్టు ప్రభావం లేని రాష్ట్రంగా మారిందని డీజీపీ శివధర్రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు ప్రస్తుతం కల్పిస్తున్న భారీ భద్రతను పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. భద్రతను ఒక్కసారిగా తొలగించడం సాధ్యం కాదని, అందుకే విడతల వారీగా వీఐపీల సెక్యూరిటీని తగ్గించేలా పోలీస్ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో చాలా మందికి గన్ మెన్ల అవసరం ఉండకపోవచ్చని ఆయన సూచించారు.
ఆదిలాబాద్ జిల్లా చించుఘాట్, చోడేగాడ్ వంటి మారుమూల ప్రాంతాల్లో డీజీపీ పర్యటించారు.గూడెంలోని ఆదివాసీలతో కలిసి ఆయన భోజనం చేసి, వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఆదివాసీల ఆచారాలు, సంస్కృతి ఎంతో గొప్పవని, వాటిని కాపాడుకోవాలని ఆయన సూచించారు. వాస్తవ దృక్పథం: “అంతరాలు లేని సమాజం” అనేది కేవలం పుస్తకాల్లో రాసుకోవడానికే బాగుంటుందని, వాస్తవంలో అది సాధ్యం కాదని ఆయన తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఆదివాసీ పెద్దలతో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన డీజీపీ శివధర్రెడ్డి పాల్గొన్నారు. పోలీసుశాఖ తరపున స్థానిక యువతకు డీజీపీ హెల్మెట్లను పంపిణీ చేశారు. ప్రతి ఊరికి ఓ గ్రంథాలయం ఏర్పాటు చేసుకోవాలని డీసీపీ మాట్లాడారు. చేతిలో సెల్ఫోన్ లేకపోయినా ఫరువాలేదు కానీ పుస్తకం ఉంచుకోవాలని హితవుచెప్పారు. హెల్మెట్లను ఊరికే ఇంట్లో ఉంచుకోవద్దని వాహనాన్ని నడుపుతున్నప్పుడు ధరించాలని డీజీపీ ఊరి ప్రజలకు సూచించారు.
తాజా వార్తలు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!
- కువైట్కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..









