వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న'డిక్టేటర్'
- July 23, 2015
వచ్చే సంక్రాంతి బరిలో ఎవరెవరు దిగుతారనే విషయంలో ఇప్పటి నుండే ఆసక్తి నెలకొంది... ఎవరి సంగతి ఎలా ఉన్నా నందమూరి బాలకృష్ణ మాత్రం 'డిక్టేటర్'గా సంక్రాంతికి వస్తాడని తెలుస్తోంది. ఆ పండగను టార్గెట్ గా పెట్టుకునే దర్శకుడు శ్రీవాస్ ఈ సినిమా షెడ్యూల్స్ ను ప్లాన్ చేశాడని అంటున్నారు. ప్రస్తుతం 'డిక్టేటర్' షూటింగ్ నానక్ రామ్ గూడాలోని రామానాయుడు సినీ విలేజ్ లో వేసిన స్పెషల్ సెట్ లో జరుగుతోంది. బాలకృష్ణ, హీరోయిన్లు అంజలి, సోనాల్ చౌహాన్ తో పాటు ప్రధాన తారాగణమంతా ఇందులో పాల్గొంటోంది. దీని తర్వాత షెడ్యూల్ ను యూరప్ లో జరుపుబోతున్నారు. నందమూరి బాలకృష్ణ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైందంటే... విజయం ఖాయమనేది ఆయన అభిమానుల నమ్మకం. కొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా... అత్యధిక శాతం చిత్రాలు ఈ సీజన్ లో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాయి. 'భార్గవరాముడు', 'ఇన్ స్పెక్టర్ ప్రతాప్', 'వంశానికొక్కడు', పెద్దన్నయ్య', 'సమరసింహారెడ్డి, 'నరసింహనాయుడు', 'లక్ష్మీనరసింహా' చిత్రాలే అందుకు ఉదాహరణ! సో... అదే నమ్మకంతో ఈ సారి కూడా 'డిక్టేటర్'ను సంక్రాంతి బరిలోనే నిలపాలని దర్శకుడు శ్రీవాస్ భావిస్తున్నాడు. అలానే ఎరాస్ సంస్థ దక్షిణాదిన సినిమా నిర్మిస్తే... సక్సెస్ కాదనే సెంటిమెంట్ కూడా ఒకటి ఉంది. 'డిక్టేటర్'తో ఆ సెంటిమెంట్ కూడా చెరిగిపోతుందని, కొత్త సంవత్సరం ఈ సంస్థకు భారీ విజయం దక్కుతుందని నందమూరి అభిమానులు భావిస్తున్నారు... మరి ఏం జరుగుతుందో చూద్దాం!!
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







