మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- April 20, 2026
తిరుమల: తిరుమల శ్రీవారి చెంత వేసవి రద్దీ ప్రారంభం కాబోతోంది. ఈ వారంతో విద్యాసంస్థలకు వేసవి సెలవులు ముగియనుండటంతో, మే నెల ప్రారంభం నుండి భక్తుల తాకిడి విపరీతంగా ఉండే అవకాశం ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అంచనా వేస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది.
వేసవిలో రద్దీని నియంత్రించేందుకు, సామాన్యులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు టీటీడీ ఈ క్రింది మార్పులను ప్రకటించింది. సిఫారసు లేఖల రద్దు మే 1వ తేదీ నుండి వీఐపీ సిఫారసు లేఖలపై ఇచ్చే బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేయనున్నారు. కేవలం స్వయంగా వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే దర్శన సౌకర్యం ఉంటుంది. దర్శన సమయం పెంపు సిఫారసు లేఖల రద్దు ద్వారా ఆదా అయ్యే సమయాన్ని సర్వదర్శనం భక్తులకు కేటాయించనున్నారు. యథావిధిగా కొనసాగేవి రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, చంటి పిల్లలు, వయోవృద్ధులు, ఆర్జిత సేవలు యథావిధిగా కొనసాగుతాయి. నేరుగా దర్శనం టోకెన్లు లేని భక్తులకు కూడా నేరుగా స్వామివారిని దర్శించుకునేలా క్యూ లైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా చర్యలు తీసుకుంటున్నారు.
వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తిరుమల కొండపై భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గంగమ్మ ఆలయం నుండి బాట గంగమ్మ క్యూలైన్ వరకు జిగ్జాగ్ లైన్లతో పాటు భారీ జర్మన్ షెడ్లను ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాల్లో, లడ్డూ కౌంటర్ల వద్ద భక్తుల పాదాలు కాలకుండ గ్రీన్ మ్యాట్లు పరచడంతో పాటు రోడ్లపై కూల్ పెయింట్ వేశారు. క్యూ లైన్లలో, షెడ్లలో వేచి ఉండే భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా ‘జల ప్రసాదం’ పేరుతో చల్లని తాగునీటిని నిరంతరం సరఫరా చేస్తున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









