మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు

- April 20, 2026 , by Maagulf
మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు

తిరుమల: తిరుమల శ్రీవారి చెంత వేసవి రద్దీ ప్రారంభం కాబోతోంది. ఈ వారంతో విద్యాసంస్థలకు వేసవి సెలవులు ముగియనుండటంతో, మే నెల ప్రారంభం నుండి భక్తుల తాకిడి విపరీతంగా ఉండే అవకాశం ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అంచనా వేస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది.

వేసవిలో రద్దీని నియంత్రించేందుకు, సామాన్యులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు టీటీడీ ఈ క్రింది మార్పులను ప్రకటించింది. సిఫారసు లేఖల రద్దు మే 1వ తేదీ నుండి వీఐపీ సిఫారసు లేఖలపై ఇచ్చే బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేయనున్నారు. కేవలం స్వయంగా వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే దర్శన సౌకర్యం ఉంటుంది. దర్శన సమయం పెంపు సిఫారసు లేఖల రద్దు ద్వారా ఆదా అయ్యే సమయాన్ని సర్వదర్శనం భక్తులకు కేటాయించనున్నారు. యథావిధిగా కొనసాగేవి రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, చంటి పిల్లలు, వయోవృద్ధులు, ఆర్జిత సేవలు యథావిధిగా కొనసాగుతాయి. నేరుగా దర్శనం టోకెన్లు లేని భక్తులకు కూడా నేరుగా స్వామివారిని దర్శించుకునేలా క్యూ లైన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా చర్యలు తీసుకుంటున్నారు.

వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తిరుమల కొండపై భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గంగమ్మ ఆలయం నుండి బాట గంగమ్మ క్యూలైన్ వరకు జిగ్‌జాగ్ లైన్లతో పాటు భారీ జర్మన్ షెడ్లను ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాల్లో, లడ్డూ కౌంటర్ల వద్ద భక్తుల పాదాలు కాలకుండ గ్రీన్ మ్యాట్లు పరచడంతో పాటు రోడ్లపై కూల్ పెయింట్ వేశారు. క్యూ లైన్లలో, షెడ్లలో వేచి ఉండే భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా ‘జల ప్రసాదం’ పేరుతో చల్లని తాగునీటిని నిరంతరం సరఫరా చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com