తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- April 21, 2026
హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో పార్టీ రజతోత్సవాల ముగింపు దశలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ భవిష్యత్ వ్యూహంపై దృష్టి సారించారు.ఈ నెల 27న హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పార్టీ ముఖ్య నేతలతో ఆయన కీలక సమావేశం నిర్వహించనున్నారు.
ఈ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ ముఖ్య నాయకులకు ఆహ్వానాలు పంపించారు. ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లు మరియు ఇతర కీలక నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చ జరగనుంది.
ఈ భేటీలో పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పటిష్టం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించే అవకాశం ఉంది. సభ్యత్వ నమోదు కార్యక్రమాలు వేగవంతం చేయడం, కొత్త నాయకత్వాన్ని తీసుకురావడం, పార్టీ కేడర్ను చురుకుగా మార్చడం వంటి అంశాలపై కేసీఆర్ మార్గనిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్







