తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- April 21, 2026
హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో పార్టీ రజతోత్సవాల ముగింపు దశలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ భవిష్యత్ వ్యూహంపై దృష్టి సారించారు.ఈ నెల 27న హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పార్టీ ముఖ్య నేతలతో ఆయన కీలక సమావేశం నిర్వహించనున్నారు.
ఈ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ ముఖ్య నాయకులకు ఆహ్వానాలు పంపించారు. ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లు మరియు ఇతర కీలక నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చ జరగనుంది.
ఈ భేటీలో పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పటిష్టం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించే అవకాశం ఉంది. సభ్యత్వ నమోదు కార్యక్రమాలు వేగవంతం చేయడం, కొత్త నాయకత్వాన్ని తీసుకురావడం, పార్టీ కేడర్ను చురుకుగా మార్చడం వంటి అంశాలపై కేసీఆర్ మార్గనిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..









