ఏపీలో సెగలు పుట్టిస్తున్న ఎండలు..
- April 25, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. వేసవి తీవ్రత దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో భానుడు ప్రతాపం చూపుతుండటంతో జనం బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు.
రాష్ట్రంలోనే అత్యధికంగా కర్నూలులో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాయలసీమ వ్యాప్తంగా మెజారిటీ ప్రాంతాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల్లో తీవ్రమైన ఎండలతో పాటు ఉక్కపోత తోడవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
కేవలం రాయలసీమలోనే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా 20కి పైగా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటేశాయి. కోస్తాంధ్రలోనూ ఎండల తీవ్రత పెరిగింది. రాజధాని అమరావతితో పాటు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లోనూ తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయి.
తాజా వార్తలు
- విక్రమ్ 1 దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్..జెండా ఊపి ప్రారంభించిన సీఎం రేవంత్
- కువైట్ ఎయిర్వేస్ 13 గమ్యస్థానాలకు 35 విమాన సర్వీసులు పునఃప్రారంభం
- IPL 2026: రాజస్తాన్ పై హైదరాబాద్ ఘన విజయం
- ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్: మెట్రో నగరాలకే కాదు..విజయవాడకు పాకిన ఏఐ విప్లవం
- IPL 2026: DC పై పంజాబ్ ఘనవిజయం
- ఏపీలో సెగలు పుట్టిస్తున్న ఎండలు..
- నీతిఆయోగ్ నూతన వైస్ ఛైర్మన్ గా అశోక్ కుమార్
- ఎన్టీఆర్ లెజెండరీ అవార్డ్స్ పోస్టర్ను ఆవిష్కరించిన దగ్గుబాటి పురందేశ్వరి
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?









