బహ్రెయిన్ అధ్యక్షతన జీసీసీ జుడిషియల్ మీటింగ్..!!
- May 14, 2026
మనామా: పబ్లిక్ ప్రాసిక్యూటర్ల కోసం ఏర్పాటు చేసిన జీసీసీ సంయుక్త సహకార కమిటీ 18వ సమావేశానికి బహ్రెయిన్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ అధ్యక్షత వహించింది. ఈ వర్చువల్ సమావేశానికి బహ్రెయిన్ పబ్లిక్ ప్రాసిక్యూషన్లోని అంతర్జాతీయ సహకార మరియు మానవ హక్కుల కార్యాలయ అధిపతి కౌన్సిలర్ అబ్దుల్లా ఇసా అల్ దోసరి అధ్యక్షత వహించగా, జీసీసీ సభ్య దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
జీసీసీ దేశాల మధ్య న్యాయ సహకారాన్ని బలోపేతం చేయడం, యూనిఫైడ్ సహకార విధానాలను సమీక్షించడం, న్యాయపరమైన అభ్యర్థనలను పరిష్కరించడంలో వేగం మరియు సామర్థ్యాన్ని మెరుగుపరచడంపై చర్చించారు.
అదే విధంగా సంయుక్త గల్ఫ్ న్యాయ కార్యకలాపాలను మెరుగుపరచడానికి, చట్టపరమైన మరియు సాంకేతిక పురోగతులకు అనుగుణంగా సహకార యంత్రాంగాలను అభివృద్ధి చేయవలసిన ప్రాముఖ్యతను కూడా అధికారులు తెలియజేశారని ఒక ప్రకటనలో వెల్లడించారు.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







