బహ్రెయిన్ అధ్యక్షతన జీసీసీ జుడిషియల్ మీటింగ్..!!

- May 14, 2026 , by Maagulf
బహ్రెయిన్ అధ్యక్షతన జీసీసీ జుడిషియల్ మీటింగ్..!!

మనామా: పబ్లిక్ ప్రాసిక్యూటర్ల కోసం ఏర్పాటు చేసిన జీసీసీ సంయుక్త సహకార కమిటీ 18వ సమావేశానికి బహ్రెయిన్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ అధ్యక్షత వహించింది. ఈ వర్చువల్ సమావేశానికి బహ్రెయిన్ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌లోని అంతర్జాతీయ సహకార మరియు మానవ హక్కుల కార్యాలయ అధిపతి కౌన్సిలర్ అబ్దుల్లా ఇసా అల్ దోసరి అధ్యక్షత వహించగా, జీసీసీ సభ్య దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.

జీసీసీ దేశాల మధ్య న్యాయ సహకారాన్ని బలోపేతం చేయడం, యూనిఫైడ్ సహకార విధానాలను సమీక్షించడం, న్యాయపరమైన అభ్యర్థనలను పరిష్కరించడంలో వేగం మరియు సామర్థ్యాన్ని మెరుగుపరచడంపై చర్చించారు.

అదే విధంగా సంయుక్త గల్ఫ్ న్యాయ కార్యకలాపాలను మెరుగుపరచడానికి, చట్టపరమైన మరియు సాంకేతిక పురోగతులకు అనుగుణంగా సహకార యంత్రాంగాలను అభివృద్ధి చేయవలసిన ప్రాముఖ్యతను కూడా అధికారులు తెలియజేశారని ఒక ప్రకటనలో వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com