బహ్రెయిన్ అధ్యక్షతన జీసీసీ జుడిషియల్ మీటింగ్..!!
- May 14, 2026
మనామా: పబ్లిక్ ప్రాసిక్యూటర్ల కోసం ఏర్పాటు చేసిన జీసీసీ సంయుక్త సహకార కమిటీ 18వ సమావేశానికి బహ్రెయిన్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ అధ్యక్షత వహించింది. ఈ వర్చువల్ సమావేశానికి బహ్రెయిన్ పబ్లిక్ ప్రాసిక్యూషన్లోని అంతర్జాతీయ సహకార మరియు మానవ హక్కుల కార్యాలయ అధిపతి కౌన్సిలర్ అబ్దుల్లా ఇసా అల్ దోసరి అధ్యక్షత వహించగా, జీసీసీ సభ్య దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
జీసీసీ దేశాల మధ్య న్యాయ సహకారాన్ని బలోపేతం చేయడం, యూనిఫైడ్ సహకార విధానాలను సమీక్షించడం, న్యాయపరమైన అభ్యర్థనలను పరిష్కరించడంలో వేగం మరియు సామర్థ్యాన్ని మెరుగుపరచడంపై చర్చించారు.
అదే విధంగా సంయుక్త గల్ఫ్ న్యాయ కార్యకలాపాలను మెరుగుపరచడానికి, చట్టపరమైన మరియు సాంకేతిక పురోగతులకు అనుగుణంగా సహకార యంత్రాంగాలను అభివృద్ధి చేయవలసిన ప్రాముఖ్యతను కూడా అధికారులు తెలియజేశారని ఒక ప్రకటనలో వెల్లడించారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం
- చైనాలో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- ప్రయాణికులకు మద్దతు..ఖతార్ రైల్ సన్ఫ్లవర్ ప్రోగ్రామ్..!!
- సాహెల్ యాప్ ద్వారా దేశీయ డ్రైవర్ వీసా సేవలు..!!
- దుబాయ్లోని దుకాణ యజమానులకు సైన్ బోర్డు రూల్స్..!!
- రియాద్లో జీసీసీ మంత్రుల అత్యవసర సమావేశం..!!
- ఏడాదిలో ఏడు కంటే ఎక్కువ ఉద్యోగాలను కలిగి ఉండటంపై నిషేధం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన జీసీసీ జుడిషియల్ మీటింగ్..!!
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...









