ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం
- May 14, 2026
న్యూ ఢిల్లీ: ఎయిర్ ఇండియా సంస్థ అంతర్జాతీయ ప్రయాణికులకు షాక్ ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ విమాన సర్వీసులను భారీగా తగ్గించడంతో పాటు కొన్ని ముఖ్యమైన అంతర్జాతీయ మార్గాల్లో విమానాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఇంధన ధరలు పెరగడం మరియు గగనతల ఆంక్షలు ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలని సంస్థ వెల్లడించింది.
నిలిచిపోయిన 6 ప్రధాన అంతర్జాతీయ రూట్లు
ఆర్థిక భారానికి తోడు వాణిజ్యపరంగా లాభదాయకంగా లేని కారణంగా 6 ప్రధాన మార్గాల్లో సేవలను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. ఇందులో ఢిల్లీ-చికాగో, ముంబై-న్యూయార్క్, ఢిల్లీ-షాంఘై, చెన్నై-సింగపూర్, ముంబై-ఢాకా మరియు ఢిల్లీ-మాలే రూట్లు ఉన్నాయి. ఈ మార్గాల్లో ఆగస్టు నెల వరకు విమాన సేవలు అందుబాటులో ఉండవని ఎయిర్ లైన్ స్పష్టం చేసింది.
కొనసాగనున్న కీలక విదేశీ సర్వీసులు కొన్ని రూట్లలో సర్వీసులు తగ్గించినప్పటికీ, నెలకు 1,200 కంటే ఎక్కువ అంతర్జాతీయ విమానాలను నడుపుతామని సంస్థ తెలిపింది. దీని ప్రకారం ఉత్తర అమెరికాకు వారానికి 33, యూరప్కు 47, యూకేకు 57 విమానాలు నడుస్తాయి. అలాగే ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా మరియు ఆఫ్రికా దేశాలకు నిర్ణీత సంఖ్యలో సర్వీసులను కొనసాగించనున్నట్లు ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







