షాద్‌నగర్‌లో భారీ ఎన్కౌంటర్

- August 07, 2016 , by Maagulf
షాద్‌నగర్‌లో భారీ ఎన్కౌంటర్

ఉగ్రవాదులు తలదాచుకున్నారనే సమాచారంతో మహబూబ్‌నగర్ జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. షాద్‌నగర్‌లోని మిలీనియం టౌన్‌షిప్‌లో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందుకున్న ఎన్ఐఏ బృందాలు స్పెషల్ ఆపరేషన్‌ను నిర్వహించింది. ఓ ఇంటిని చుట్టుముట్టింది. ఎన్‌ఐఏ అధికారుల కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమైనట్లు సమాచారం. ఉగ్రవాదులను అదుపులోకి తీసుకునే క్రమంలో కాల్పులు జరగడంతో ఎన్ఐఏ, ఆర్మీ ఎదురుకాల్పులు జరిపారు. ప్రస్తుతం ఉగ్రవాదులు, ఎన్‌ఐఏ బృందాల మధ్య కాల్పుల పరంపర ఇంకా కొనసాగుతోంది. ఉగ్రవాది హతంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరో ఇద్దరు ఉగ్రవాదులు ఆ ఇంట్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో మిలీనియం టౌన్‌షిప్ పూర్తిగా ఎన్ఐఏ, ఆర్మీ అదుపులోకి వెళ్లింది. కాల్పుల నేపథ్యంలో టౌన్‌షిప్‌కు ఒక కిలోమీటర్ మేర ఇళ్లను ఎన్ఐఏ ఖాళీ చేయిస్తోంది. ఇప్పటికే పది మంది అనుమానితులను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. భాషా అనే అనుమానితుడి ఇంటిని ఎన్ఐఏ అధికారులు చుట్టుముట్టారు. అయితే ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనతో మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రుల పర్యటనలు రద్దు అయ్యాయి. మరోవైపు ప్రధాని మోదీ టూర్‌ను వీరు లక్ష్యంగా చేసుకున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com