షాద్నగర్లో భారీ ఎన్కౌంటర్
- August 07, 2016
ఉగ్రవాదులు తలదాచుకున్నారనే సమాచారంతో మహబూబ్నగర్ జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. షాద్నగర్లోని మిలీనియం టౌన్షిప్లో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందుకున్న ఎన్ఐఏ బృందాలు స్పెషల్ ఆపరేషన్ను నిర్వహించింది. ఓ ఇంటిని చుట్టుముట్టింది. ఎన్ఐఏ అధికారుల కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమైనట్లు సమాచారం. ఉగ్రవాదులను అదుపులోకి తీసుకునే క్రమంలో కాల్పులు జరగడంతో ఎన్ఐఏ, ఆర్మీ ఎదురుకాల్పులు జరిపారు. ప్రస్తుతం ఉగ్రవాదులు, ఎన్ఐఏ బృందాల మధ్య కాల్పుల పరంపర ఇంకా కొనసాగుతోంది. ఉగ్రవాది హతంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరో ఇద్దరు ఉగ్రవాదులు ఆ ఇంట్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో మిలీనియం టౌన్షిప్ పూర్తిగా ఎన్ఐఏ, ఆర్మీ అదుపులోకి వెళ్లింది. కాల్పుల నేపథ్యంలో టౌన్షిప్కు ఒక కిలోమీటర్ మేర ఇళ్లను ఎన్ఐఏ ఖాళీ చేయిస్తోంది. ఇప్పటికే పది మంది అనుమానితులను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. భాషా అనే అనుమానితుడి ఇంటిని ఎన్ఐఏ అధికారులు చుట్టుముట్టారు. అయితే ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనతో మహబూబ్నగర్ జిల్లాలో మంత్రుల పర్యటనలు రద్దు అయ్యాయి. మరోవైపు ప్రధాని మోదీ టూర్ను వీరు లక్ష్యంగా చేసుకున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు









