రెండు గ్యాంగుల కథ!
- August 07, 2016
నాగశివ, కిమయ జంటగా తలారి నాగరాజు దర్శకత్వంలో జాలి ఫిలిమ్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'బిట్రగుంట'. జె.వి.నాయుడు ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం ఆదివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ఆర్.కె.గౌడ్ క్లాప్నిచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో చిత్ర నిర్మాత నాయుడు మాట్లాడుతూ, టైటిల్ బాగుందని ప్రశంసలు వస్తున్నాయని, హీరో నాగశివతోపాటు కొత్త కుర్రాళ్లను నటీనటులుగా పరిచయం చేస్తున్నామన్నారు. సర్దార్ గబ్బర్సింగ్ విలన్ బ్యాచ్ నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ మొదటివారంలో చిత్రీకరణ ప్రారంభించి, నెలాఖరుకు ఒకే షెడ్యూల్లో పూర్తిచేస్తామన్నారు. విజయవాడ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో చిత్రీకరణ జరుపుతాం. చక్కని క్రైమ్ థ్రిల్లర్ ఇది అన్నారు. దర్శకుడు నాగరాజు తలారి మాట్లాడుతూ, ప్రేమలో ఎబిసి అనే చిత్రం చేశానని, ప్రస్తుతం 'లంగావోణి' అనే చిత్రం చేస్తున్నానని. తన మూడో ప్రయత్నమిదన్నారు. ఇది దారిదోపిడీలు, మర్డర్లు, మానభంగాలు చేసే రెండు గ్యాంగుల చుట్టూ తరిగే కథని, ఆ గ్యాంగులకు, పోలీసులకు మధ్య సాగే ఛేజింగులు, ప్రేమకథతో ఈ సినిమా ఉంటుందన్నారు. నెల్లూరు జిల్లాలోని బిట్రగుంటలో జరిగిన 1960నుంచి 1980 మధ్య జరిగిన సంఘటనల ఆధారంగా అల్లుకున్న కథ ఇది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కున్నీ జి., మాటలు: బెజవాడ మురళీకృష్ణన్, కెమెరా: బైపల్లి రవికుమార్, నిర్మాత: జె.వి.నాయుడు, దర్శకత్వం: తలారి నాగరాజు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







