రెండు గ్యాంగుల కథ!
- August 07, 2016
నాగశివ, కిమయ జంటగా తలారి నాగరాజు దర్శకత్వంలో జాలి ఫిలిమ్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'బిట్రగుంట'. జె.వి.నాయుడు ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం ఆదివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ఆర్.కె.గౌడ్ క్లాప్నిచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో చిత్ర నిర్మాత నాయుడు మాట్లాడుతూ, టైటిల్ బాగుందని ప్రశంసలు వస్తున్నాయని, హీరో నాగశివతోపాటు కొత్త కుర్రాళ్లను నటీనటులుగా పరిచయం చేస్తున్నామన్నారు. సర్దార్ గబ్బర్సింగ్ విలన్ బ్యాచ్ నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ మొదటివారంలో చిత్రీకరణ ప్రారంభించి, నెలాఖరుకు ఒకే షెడ్యూల్లో పూర్తిచేస్తామన్నారు. విజయవాడ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో చిత్రీకరణ జరుపుతాం. చక్కని క్రైమ్ థ్రిల్లర్ ఇది అన్నారు. దర్శకుడు నాగరాజు తలారి మాట్లాడుతూ, ప్రేమలో ఎబిసి అనే చిత్రం చేశానని, ప్రస్తుతం 'లంగావోణి' అనే చిత్రం చేస్తున్నానని. తన మూడో ప్రయత్నమిదన్నారు. ఇది దారిదోపిడీలు, మర్డర్లు, మానభంగాలు చేసే రెండు గ్యాంగుల చుట్టూ తరిగే కథని, ఆ గ్యాంగులకు, పోలీసులకు మధ్య సాగే ఛేజింగులు, ప్రేమకథతో ఈ సినిమా ఉంటుందన్నారు. నెల్లూరు జిల్లాలోని బిట్రగుంటలో జరిగిన 1960నుంచి 1980 మధ్య జరిగిన సంఘటనల ఆధారంగా అల్లుకున్న కథ ఇది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కున్నీ జి., మాటలు: బెజవాడ మురళీకృష్ణన్, కెమెరా: బైపల్లి రవికుమార్, నిర్మాత: జె.వి.నాయుడు, దర్శకత్వం: తలారి నాగరాజు.
తాజా వార్తలు
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!









