భారత్ నుంచి 5 దేశాల పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ

- May 15, 2026 , by Maagulf
భారత్ నుంచి 5 దేశాల పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ

న్యూ ఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన సంక్షోభం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ నేటి (శుక్రవారం, మే 15) నుంచి అత్యంత కీలకమైన ఐదు దేశాల పర్యటనను ప్రారంభించారు. 6 రోజుల పాటు సాగనున్న ఈ పర్యటనలో భాగంగా ఆయన యూఏఈతో పాటు నాలుగు ఐరోపా దేశాల్లో (నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ) పర్యటించనున్నారు.

పర్యటనలో భాగంగా మోదీ మొదట యూఏఈ రాజధాని అబుదాబి చేరుకుంటారు. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల కారణంగా ‘హర్మూజ్ జలసంధి’ మూతపడటం, ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు ఆటంకాలు కలగడం వంటి పరిణామాల మధ్య ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com