ఎబోలాతో 88 మంది మృతి.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO
- May 17, 2026
ఆఫ్రికా దేశాలైన కాంగో, ఉగాండాల్లో ఎబోలా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. గత కొద్ది రోజులుగా ఇక్కడ వైరస్ వ్యాప్తి రేటు అసాధారణంగా పెరగడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటివరకు 300కు పైగా అనుమానిత కేసులు నమోదు కాగా, అందులో 88 మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా అప్రమత్తత అవసరమని గుర్తిస్తూ, WHO ఈ పరిస్థితిని “పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్” (అంతర్జాతీయ ప్రాధాన్యత గల ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి) గా ప్రకటించింది.
ఈ ప్రత్యేక ప్రకటన ద్వారా ఎబోలా ప్రభావిత ప్రాంతాలకు గ్లోబల్ లెవెల్లో తక్షణ సహాయం అందే మార్గం సుగమమైంది. వైరస్ నిర్మూలనకు అవసరమైన నిధులు, అత్యవసర వ్యాక్సిన్లు మరియు అంతర్జాతీయ వైద్య నిపుణుల సేవలు బాధిత దేశాలకు వేగంగా చేరనున్నాయి. అయితే, ఎబోలా అత్యంత వేగంగా సంక్రమించే వ్యాధి కావడంతో, అంతర్జాతీయ సరిహద్దుల గుండా ఇది ఇతర దేశాలకు పాకకుండా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రయాణికులపై కఠిన నిఘా ఉంచాలని ఆరోగ్య రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







