ఎబోలాతో 88 మంది మృతి.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO
- May 17, 2026
ఆఫ్రికా దేశాలైన కాంగో, ఉగాండాల్లో ఎబోలా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. గత కొద్ది రోజులుగా ఇక్కడ వైరస్ వ్యాప్తి రేటు అసాధారణంగా పెరగడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటివరకు 300కు పైగా అనుమానిత కేసులు నమోదు కాగా, అందులో 88 మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా అప్రమత్తత అవసరమని గుర్తిస్తూ, WHO ఈ పరిస్థితిని “పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్” (అంతర్జాతీయ ప్రాధాన్యత గల ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి) గా ప్రకటించింది.
ఈ ప్రత్యేక ప్రకటన ద్వారా ఎబోలా ప్రభావిత ప్రాంతాలకు గ్లోబల్ లెవెల్లో తక్షణ సహాయం అందే మార్గం సుగమమైంది. వైరస్ నిర్మూలనకు అవసరమైన నిధులు, అత్యవసర వ్యాక్సిన్లు మరియు అంతర్జాతీయ వైద్య నిపుణుల సేవలు బాధిత దేశాలకు వేగంగా చేరనున్నాయి. అయితే, ఎబోలా అత్యంత వేగంగా సంక్రమించే వ్యాధి కావడంతో, అంతర్జాతీయ సరిహద్దుల గుండా ఇది ఇతర దేశాలకు పాకకుండా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రయాణికులపై కఠిన నిఘా ఉంచాలని ఆరోగ్య రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం







