జీసీసీ ‘వాఫెడ్’: ప్రవాస కార్మికులకు వైద్య పరీక్షలు..!!
- May 17, 2026
కువైట్: గల్ఫ్ దేశాలకు వెళ్లే ప్రవాస కార్మికుల కోసం ఉద్దేశించిన జీసీసీ వాఫెడ్ కార్యక్రమానికి సంబంధించిన నిబంధనలను కువైట్ ఆరోగ్య శాఖ మంత్రి అహ్మద్ అల్-అవాధి ఆమోదించారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులను జారీ చేశారు. GCC సభ్య దేశాలలో వర్క్ లేదా రెసిడెన్సీ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే ప్రవాసుల వైద్య పరీక్షల కోసం ఒక సమగ్రమైన ఫ్రేమ్ వర్క్ ను ఏర్పాటు చేస్తారు.
ఈ కార్యక్రమం కింద ప్రవాస కార్మికులు తమ శారీరక మరియు మానసిక దృఢత్వాన్ని నిర్ధారించుకోవడానికి, అలాగే GCC దేశాలలో ప్రజారోగ్యానికి ముప్పు కలిగించే అంటువ్యాధుల నుండి వారు విముక్తి పొందారని ధృవీకరించుకోవడానికి క్లినికల్, ప్రయోగశాల మరియు రేడియాలజికల్ పరీక్షలు చేయించుకోవాలి.
ఈ నిబంధనలలో 15 అధ్యాయాలు మరియు 54 ప్రకరణలు ఉన్నాయి. ఇవి జీసీసీ ఆరోగ్య మండలి, ఆరోగ్య మంత్రిత్వ శాఖలు, గుర్తింపు పొందిన వైద్య సౌకర్యాలు, సాంకేతిక కమిటీలు, ఫిర్యాదుల పరిష్కార విధానాలు, గోప్యతా నియమాలు మరియు నైతిక ప్రమాణాలన వివరించాడు.
ఇక సబ్ రూల్స్ కార్మికులను పంపించే దేశాలలో వాఫెడ్ (Wafed) కార్యక్రమాన్ని పర్యవేక్షించడం, విస్తరించడంలో సహకార మండలి దేశాల ఆరోగ్య మండలి బాధ్యతలను కూడా నిర్వచిస్తాయి.
గుర్తింపు పొందిన ఆరోగ్య కేంద్రాలచే జారీ చేయబడిన మెడికల్ సర్టిఫికేట్లు, వీసా ప్రాసెసింగ్ మరియు ధృవీకరణ ప్రయోజనాల కోసం, జారీ చేసిన తేదీ నుండి రెండు నెలల పాటు చెల్లుబాటులో ఉంటాయని ఈ కార్యక్రమం పేర్కొంటోంది.
వ్యక్తిగత సభ్య దేశాలచే మినహాయింపు పొందిన వయస్సు వర్గాలను మినహాయించి, పని లేదా నివాసం కోసం GCC దేశాలలోకి ప్రవేశించే ప్రవాసులందరికీ ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. దరఖాస్తు ప్రక్రియలో భాగంగా వ్యాక్సినేషన్ కార్డులను కూడా వాఫెడ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్లో అప్లోడ్ చేయాలి.
తాజా వార్తలు
- ఈద్ అల్ అదా 2026 తేదీ ఖరారు చేసిన దేశాలు..
- అబుదాబి బరాకా అణు విద్యుత్ కేంద్రం వద్ద డ్రోన్ దాడి..అగ్నిప్రమాదం
- చిల్కూరు బాలాజీ ఆలయం పై అమెరికా సెనేటర్ అనుచిత వ్యాఖ్యలు
- విదేశీ నియామకాలను అధిగమించిన బహ్రెయిన్ ఉద్యోగాలు..!!
- జీసీసీ ‘వాఫెడ్’: ప్రవాస కార్మికులకు వైద్య పరీక్షలు..!!
- సౌదీలో 7రోజుల్లో 11,272 మంది నివాసితులు బహిష్కరణ..!!
- ఆన్లైన్ లో వ్యాఖ్యల పై యూఏఈ వార్నింగ్.. Dh500,000 ఫైన్..!!
- దోహా మెట్రోలో జర్నీ టూవర్డ్ హెల్త్ ఈవెంట్..!!
- ఒమన్ పాస్పోర్ట్ ర్యాంకింగ్ మెరుగు..!!
- ఎబోలాతో 88 మంది మృతి.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO









