కువైట్ చమురు క్షేత్రంపై దాడి.. పరామర్శించిన మినిస్టర్..!!
- July 15, 2026
కువైట్ సిటీ: కువైట్ ఆయిల్ కంపెనీ (KOC)కి చెందిన ఒక ఆఫ్-షోర్ చమురు క్షేత్రంపై ఇటీవల జరిగిన దాడిలో గాయపడిన ఉద్యోగిని చమురు శాఖ మంత్రి తారిఖ్ అల్-రౌమీ పరామర్శించారు. అల్-అదాన్ ఆసుపత్రికి వెళ్లిన మంత్రి, చికిత్స పొందుతున్న సదరు కార్మికుడి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మంత్రితో పాటు కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ (KPC) అధికారులు ఉన్నారు. గత ఆదివారం జరిగిన ఈ దాడిలో, KOC అనుబంధ చమురు సేవల సంస్థలో పనిచేస్తున్న మహ్మద్ అబ్దుల్ మొహ్సేన్ సులేమాన్ అనే కార్మికుడు గాయపడ్డారు.
ఈ సందర్భంగా చమురు క్షేత్రంపై జరిగిన దాడిని మంత్రి తీవ్రంగా ఖండించారు. కువైట్ దేశాన్ని లక్ష్యంగా చేసుకుని ఇటీవల జరుగుతున్న వరుస దాడుల్లో భాగంగానే ఈ ఘటన చోటుచేసుకుందని ఆయన పేర్కొన్నారు. దేశ చమురు రంగంలో పనిచేసే ఉద్యోగుల రక్షణకే తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని మంత్రి అల్-రౌమీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- స్టేట్ రెవెన్యూ చట్టానికి సౌదీ ఆమోదం..విదేశీయులకు కొత్త ట్రైనింగ్ వీసా..!!
- ఫిఫా వరల్డ్ కప్ సెమీస్లో ఫ్రాన్స్ పై స్పెయిన్ ఘన విజయం
- 77వ వసంతంలోకి అడుగుపెట్టిన దుబాయ్ రూలర్ షేక్ మహ్మద్
- సెప్టెంబర్ తో ముగియనున్న దుబాయ్ మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్..!!
- కువైట్ చమురు క్షేత్రంపై దాడి.. పరామర్శించిన మినిస్టర్..!!
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ







