కువైట్ చమురు క్షేత్రంపై దాడి.. పరామర్శించిన మినిస్టర్..!!
- July 15, 2026
కువైట్ సిటీ: కువైట్ ఆయిల్ కంపెనీ (KOC)కి చెందిన ఒక ఆఫ్-షోర్ చమురు క్షేత్రంపై ఇటీవల జరిగిన దాడిలో గాయపడిన ఉద్యోగిని చమురు శాఖ మంత్రి తారిఖ్ అల్-రౌమీ పరామర్శించారు. అల్-అదాన్ ఆసుపత్రికి వెళ్లిన మంత్రి, చికిత్స పొందుతున్న సదరు కార్మికుడి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మంత్రితో పాటు కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ (KPC) అధికారులు ఉన్నారు. గత ఆదివారం జరిగిన ఈ దాడిలో, KOC అనుబంధ చమురు సేవల సంస్థలో పనిచేస్తున్న మహ్మద్ అబ్దుల్ మొహ్సేన్ సులేమాన్ అనే కార్మికుడు గాయపడ్డారు.
ఈ సందర్భంగా చమురు క్షేత్రంపై జరిగిన దాడిని మంత్రి తీవ్రంగా ఖండించారు. కువైట్ దేశాన్ని లక్ష్యంగా చేసుకుని ఇటీవల జరుగుతున్న వరుస దాడుల్లో భాగంగానే ఈ ఘటన చోటుచేసుకుందని ఆయన పేర్కొన్నారు. దేశ చమురు రంగంలో పనిచేసే ఉద్యోగుల రక్షణకే తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని మంత్రి అల్-రౌమీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!







