కువైట్ చమురు క్షేత్రంపై దాడి.. పరామర్శించిన మినిస్టర్..!!

- July 15, 2026 , by Maagulf
కువైట్ చమురు క్షేత్రంపై దాడి.. పరామర్శించిన మినిస్టర్..!!

కువైట్ సిటీ: కువైట్ ఆయిల్ కంపెనీ (KOC)కి చెందిన ఒక ఆఫ్-షోర్ చమురు క్షేత్రంపై ఇటీవల జరిగిన దాడిలో గాయపడిన ఉద్యోగిని చమురు శాఖ మంత్రి తారిఖ్ అల్-రౌమీ పరామర్శించారు. అల్-అదాన్ ఆసుపత్రికి వెళ్లిన మంత్రి, చికిత్స పొందుతున్న సదరు కార్మికుడి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మంత్రితో పాటు కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ (KPC) అధికారులు ఉన్నారు. గత ఆదివారం జరిగిన ఈ దాడిలో, KOC అనుబంధ చమురు సేవల సంస్థలో పనిచేస్తున్న మహ్మద్ అబ్దుల్ మొహ్సేన్ సులేమాన్ అనే కార్మికుడు గాయపడ్డారు.

ఈ సందర్భంగా చమురు క్షేత్రంపై జరిగిన దాడిని మంత్రి తీవ్రంగా ఖండించారు. కువైట్ దేశాన్ని లక్ష్యంగా చేసుకుని ఇటీవల జరుగుతున్న వరుస దాడుల్లో భాగంగానే ఈ ఘటన చోటుచేసుకుందని ఆయన పేర్కొన్నారు. దేశ చమురు రంగంలో పనిచేసే ఉద్యోగుల రక్షణకే తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని మంత్రి అల్-రౌమీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com