ఉగ్రదాడిని ఖండించిన సౌదీ అరేబియా..!!
- May 22, 2026
రియాద్: చాడ్లోని ఒక సైనిక స్థావరంపై జరిగిన ఉగ్రదాడిని సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ దాడిలో పలువురు భద్రతా సిబ్బంది మరణించడంతో పాటు మరికొందరు గాయపడ్డారని పేర్కొంది.
చాడ్ మరియు అక్కడి ప్రజల భద్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించే ఉగ్రవాద మరియు తీవ్రవాద చర్యలను సౌదీ అరేబియా తిరస్కరిస్తుందని మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. ఈ విషాదకర సంఘటన నేపథ్యంలో చాడ్ ప్రభుత్వం మరియు ప్రజలకు తన సంఘీభావాన్ని, మద్దతును తెలియజేసింది. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







