సౌదీలో పీక్ సమ్మర్ పీరియడ్ ప్రారంభం..హెచ్చరికలు జారీ..!!
- July 17, 2026
రియాద్: సౌదీ అరేబియాలో వేసవిలో అత్యంత అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ‘జమ్రత్ అల్-ఖైద్’ (Jamrat Al-Qaydh) పీరియడ్ ప్రారంభమైంది. ఈ దశలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ సమయంలో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగి, ఏడాదిలోనే అత్యధిక స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుందని ఆఫాక్ ఖగోళ శాస్త్ర సంఘం సభ్యుడు బుర్జాస్ అల్-ఫాలిహ్ తెలిపారు.
జమ్రత్ అల్-ఖైద్ సాధారణంగా జూలై మధ్యలో ప్రారంభమై ఆగస్టు ప్రారంభం వరకు కొనసాగుతుంది. ఈ కాలాన్ని ప్రజలు ‘తబ్బాఖ్ అల్-తమ్ర్’ (Tabbakh Al-Tamr) లేదా ‘ఖర్జూరాలను పక్వానికి తీసుకెళ్లే కాలం’ అని కూడా పిలుస్తారు. తీవ్రమైన ఎండ కారణంగా ఖర్జూరాలు వేగంగా పండిపోతాయని అధికారులు తెలిపారు. ఈ సమయంలోనే వేడి గాలులు వీయడం, ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరగడం, తీర ప్రాంతాల్లో తేమ శాతం కూడా అధికంగా ఉండడం సాధారణమని ఆయన తెలిపారు.
మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు నేరుగా ఎండలో తిరగకుండా ఉండాలని, శరీరంలో నీటి శాతం తగ్గకుండా తగినంత నీరు, ఇతర ద్రవాలు తీసుకోవాలని ప్రజలకు అధికారులు సూచించారు. ఇలా చేయడం ద్వారా వేడి అలసట (Heat Exhaustion)తోపాటు వడదెబ్బ (Heatstroke) వంటి సమస్యలను నివారించవచ్చని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పిల్లల స్క్రీన్ టైమ్పై జాగ్రత్త.. నిద్ర, ఆరోగ్యంపై ప్రభావం..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన యూఎన్ఎస్సీ.. బహ్రెయిన్ స్వాగతం..!!
- దుబాయ్లో నాన్ ముస్లిం ప్రవాసుల వివాహం.. అర్హతలు, ప్రక్రియ..!!
- ఒమన్లో పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు, వడగళ్లకు అవకాశం.. 47 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- సైనిక స్థావరాల్లో రక్షణ మంత్రి తనిఖీలు.. సైన్యం సన్నద్ధతపై సమీక్ష..
- దుబాయ్లో కొత్త అల్ ఖుద్రా బ్రిడ్జి ప్రారంభం..
- బోనాల ఉత్సవాల్లో AI కెమెరాలతో అప్రమత్తమైన నిఘా:సీపీ సజ్జనార్
- రియాద్లో మృత్యువుతో పోరాడుతున్న ఏపీ వాసి.. లక్ష్మీనారాయణకు తెలుగు సంఘాల అండ
- వైజాగ్ సినీ ప్రియులకు గుడ్ న్యూస్..







