సౌదీలో పీక్ సమ్మర్ పీరియడ్ ప్రారంభం..హెచ్చరికలు జారీ..!!
- July 17, 2026
రియాద్: సౌదీ అరేబియాలో వేసవిలో అత్యంత అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ‘జమ్రత్ అల్-ఖైద్’ (Jamrat Al-Qaydh) పీరియడ్ ప్రారంభమైంది. ఈ దశలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ సమయంలో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగి, ఏడాదిలోనే అత్యధిక స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుందని ఆఫాక్ ఖగోళ శాస్త్ర సంఘం సభ్యుడు బుర్జాస్ అల్-ఫాలిహ్ తెలిపారు.
జమ్రత్ అల్-ఖైద్ సాధారణంగా జూలై మధ్యలో ప్రారంభమై ఆగస్టు ప్రారంభం వరకు కొనసాగుతుంది. ఈ కాలాన్ని ప్రజలు ‘తబ్బాఖ్ అల్-తమ్ర్’ (Tabbakh Al-Tamr) లేదా ‘ఖర్జూరాలను పక్వానికి తీసుకెళ్లే కాలం’ అని కూడా పిలుస్తారు. తీవ్రమైన ఎండ కారణంగా ఖర్జూరాలు వేగంగా పండిపోతాయని అధికారులు తెలిపారు. ఈ సమయంలోనే వేడి గాలులు వీయడం, ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరగడం, తీర ప్రాంతాల్లో తేమ శాతం కూడా అధికంగా ఉండడం సాధారణమని ఆయన తెలిపారు.
మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు నేరుగా ఎండలో తిరగకుండా ఉండాలని, శరీరంలో నీటి శాతం తగ్గకుండా తగినంత నీరు, ఇతర ద్రవాలు తీసుకోవాలని ప్రజలకు అధికారులు సూచించారు. ఇలా చేయడం ద్వారా వేడి అలసట (Heat Exhaustion)తోపాటు వడదెబ్బ (Heatstroke) వంటి సమస్యలను నివారించవచ్చని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో బోట్స్ రాకపోకలపై నిషేధం పొడిగింపు..!!
- సేఫ్ సిటీ ప్రాజెక్టు పై ఉన్నతస్థాయి సమీక్షించిన డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణలో మద్యం ధరల భారీ పెంపు
- కువైట్ పై మళ్లీ దాడులు..అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ..!!
- వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచిన జట్టుకు మరో అరుదైన గౌరవం
- ధోఫార్లో టూరిజానికి బూస్ట్.. ‘యోర్ పాత్ ఈజ్ గ్రీన్’ కు శ్రీకారం..!!
- సౌదీలో పీక్ సమ్మర్ పీరియడ్ ప్రారంభం..హెచ్చరికలు జారీ..!!
- విదేశాలకు వెళ్తున్నారా? ఈ కాఫ్ సిరఫ్ తీసుకెళితే అరెస్టు కావచ్చు..!!
- ఖతార్ పై వైమానిక దాడుల యత్నం..
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవల్లో మార్పులు..







