హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ...

- August 09, 2016 , by Maagulf
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ...

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో వూరట లభించింది. భూ సేకరణ జీవో 123 రద్దు అంశంలో రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత మంగళవారం హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. నిర్వాసితులు, రైతు కూలీలు, చేతి వృత్తుల వారికి ప్రయోజనాలు కల్పిస్తామని, దీనిపై జీవో జారీ చేస్తామని అడ్వకేట్‌ జనరల్‌ హైకోర్టుకు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు భూసేకరణ జీవో 123ను రద్దు చేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. భూముల క్రయవిక్రయాలు తుది తీర్పునకు లోబడి ఉండాలని షరతు విధించింది. జీవో జారీ చేసి తమకు సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా పడింది. మెదక్‌జిల్లాలో మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు భూసేకరణకోసం తెలంగాణ ప్రభుత్వం జీవో 123 జారీ చేసిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com