పొటాషియంది కొవ్వుని కరిగించడంలో కీలక పాత్ర
- August 09, 2016
ఏం తినాలన్నా ముందుగా మనసులో తలెత్తే ప్రశ్న.. ఇది కొవ్వుని కానీ పెంచుతుందా? అని. ప్రతి ఆహారం ఆ కోవలోకే రాదు. కొన్ని పదార్థాలు కొవ్వుని కరిగిస్తాయి కూడా. అవేంటో చూద్దాం.
తా జా పండ్లూ, కాయగూరల్లో ఉండే పొటాషియంది కొవ్వుని కరిగించడంలో కీలక పాత్ర. వీటిని తిన్నప్పుడు అవి నిదానంగా జీర్ణమవుతాయి. శక్తిని కూడా ఒక్కసారిగా కాకుండా నిదానంగా విడుదల చేస్తాయి. అదే పొటాషియం ప్రత్యేకత. ఫలితంగా శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకోకుండా ఉంటాయి.
*
వర్షం పడుతున్నప్పుడు ఆ ఆహ్లాదకరమైన వాతావరణంలో మొక్కజొన్న పేలాలు తినడానికి ఆసక్తి చూపిస్తాం కదా! వాటికి ఉండే అదనపు ప్రయోజనం కొవ్వుని అదుపులో ఉంచడం. వీటిల్లో యాంటీఆక్సిడెంట్లూ, పీచు సమృద్ధిగా ఉంటాయి. దీనికి వెన్న, ఇతరత్రా పదార్థాలు కలపకుండా కాస్తంత ఉప్పు మాత్రమే చేర్చి తీసుకుంటేనే ఆ లాభాలు పొందవచ్చు.
*
గ్లైసమిక్ స్థాయిలు తక్కువగా ఉండే ముడిబియ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండటంతో పాటూ వాటిల్లోని పీచూ, సెలీనియం వంటివి ఆకలిని అదుపులో ఉంచుతాయి. దాంతో శరీరంలో కొవ్వు త్వరగా పేరుకోదు. కొలెస్ట్రాల్, బీపీ సమస్యలూ అదుపులో ఉంటాయి.
*
పప్పు ధాన్యాలూ, వివిధ రకాల తృణధాన్యాలూ పీచుని పుష్కలంగా అందించి శరీరంలో కొవ్వు పేరుకోకుండా చేస్తాయి. ఎప్పుడూ ఒకేరకం కాకుండా కొత్తరకాల తృణధాన్యాలని ప్రయత్నించాలనుకున్నప్పుడు వాటితో జావల్లాంటివి చేసుకోండి. ఫలితాలు బాగుంటాయి.
*
కొవ్వు అధికంగా ఉండే పాల మీగడను ఉపయోగించాల్సిన వంటకాల్లో ప్రత్యామ్నాయంగా కమ్మని పెరుగుని వాడితే పోషకాలు అంది కొవ్వు సమస్య ప్రసక్తే ఉండదు. పచ్చిమిర్చిని కూరల్లో వాడితే దానిలోని ప్రత్యేక గుణాలు కెలొరీలని కరిగించేస్తాయి.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









