కార్మికుల సమస్యలపై స్పందించిన సౌదీ కింగ్
- August 09, 2016
భారతీయులు సహా పలు దేశాలకు చెందిన వలస కార్మికులు పడ్తున్న వెతల నుంచి ఉపశమనం కల్పించేందుకు సౌదీ కింగ్ పలు కీలక నిర్ణయాల్ని తీసుకుని, వాటిని అమల్లోకి తీసుకురావాల్సిందిగా సంబంధిత మంత్రిత్వ శాఖలకు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్మికుల్ని ఆదుకునేందుకుగాను 100 మిలియన్ సౌదీ రియాల్స్ (26 మిలియన్ డాలర్లు) కేటాయించారు సౌదీ కింగ్. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభ పరిస్థితులు, వాటి ప్రభావం కారణంగా సౌదీలో కన్స్ట్రక్షన్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలతో పెద్ద సంఖ్యలో కార్మికులు రోడ్డున పడ్డారు. కొన్ని సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా కార్మికుల్ని తొలగించడంతో సమస్య తీవ్రమైంది. తీవ్రమైన వెతలను అనుభవిస్తున్న తమ దేశ కార్మికుల కోసం భారతదేశం నుంచి సౌదీ ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు అందాయి. అలాగే వారిని ఆదుకునేందుకోసం ప్రభుత్వం ముందుకొచ్చి కొన్ని చర్యలు చేపట్టింది. వీటిల్లో ఆహారం అందించడం, స్వదేశానికి వచ్చేందుకు ఆర్థిక సహాయం, అలాగే పాస్పోర్ట్ క్లియరెన్స్ వంటివాటిల్లో సహాయం చేయడం ద్వారా కొంత ఉపశమనం కలిగించింది భారత ప్రభుత్వం. భారత విజ్ఞప్తిని అలాగే, ఇతర దేశాల నుంచి వస్తున్న విజ్ఞప్తుల్ని పరిశీలించిన సౌదీ కింగ్, కార్మికులను ఆదుకునేందుకు తగిన చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









