జింజిలో నివాస భవనం వద్ద అగ్ని ప్రమాదం
- August 09, 2016
మనామా : స్థానికి ఇబ్రహీం ప్లాజా సమీపంలో జింజ్ లోని ఒక నివాస భవనం వద్ద అగ్ని ప్రమాదం మంగళవారం జరిగింది. అగ్ని మాపక దళం తక్షణమే ప్రమాద సన్నివేశం చేరుకొని మంటల్ని ఆర్పేందుకు యత్నించారు. ఈ మంటలు తొలుత భవనం గ్రౌండ్ ఫ్లోర్ లోని కోల్డ్ స్టోరేజ్ ప్రక్క నుంచి మొదలైనట్లు కొందరు తెలిపారు. అధేవిధంగా పై అంతస్తుల్లో నివసిస్తున్నవారు కింద అంతస్థులో షట్టర్ మూసి ఉన్నగది ఒక కుటుంబం తాత్కాలిక వంటగది వలె ఉపయోగిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షుల కధనం ప్రకారం, రెండో అంతస్తు వరకు వెళ్లిన స్టోర్ సేల్స్ మాన్ అపార్ట్మెంట్ లో ఇప్పటికే పొగ నిండి ఉండటం గమనించి నిద్రపోతున్నఅద్దెకు ఉన్నవారిని ఈ అప్రమత్తం ఎంతగానో ఉపయోగపడింది. సకాలంలో ఆ వ్యక్తి జోక్యం చేసుకోవడం వలన పెద్ద విషాదం నుంచి భవనవాసుల్ని తప్పించడానికి సహాయపడింది. ఆ వంటగది నిజానికి వాణిజ్య ప్రయోజనం కోసం వంటగది వాడేవారు. అగ్ని ప్రమాదానికి కారణం గ్యాస్ లీకేజ్ అని అత్యధికులచే భావించబడుతోంది. అదృస్టవశాత్తు మంటలు కోల్డ్ స్టోరేజ్ వరకు విస్తరించలేదు. ఒక సంవత్సరం క్రితం ఇదే భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









