వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం..కూటమి ప్రభుత్వం పై విమర్శలు
- June 09, 2026
దోహా: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన సందర్భంగా ఖతార్లో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ప్లకార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఖతార్ వైఎస్సార్సీపీ కన్వీనర్ షేక్ జాఫర్ హుస్సేన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా షేక్ జాఫర్ హుస్సేన్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. మహిళలకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం, ఉద్యోగాల కల్పన, రైతు సంక్షేమం వంటి అంశాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు.
అలాగే డీఎస్సీ నియామకాలు, క్రీడా కోటా అంశాల్లో యువతను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రభుత్వం వైఫల్యాల బాటలో నడుస్తోందని, ప్రజల సమస్యలను విస్మరించి పాలన సాగిస్తోందని అన్నారు.
జీసీసీ కో-కన్వీనర్ దొండపాటి శశికిరణ్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో బాబు శీకొలు, సురేష్ వాసర్ల, సూర్య రాపాక, షాన్ షేక్, మనీష్ రెడ్డి, మోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, నరసింహ రెడ్డి, శేఖర్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, దినేష్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, షోయబ్, జాహిద్ హుస్సేన్, భాను ప్రకాష్, అలీం, రాజ్ కుమార్, పితాని శ్రీను తదితరులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ గవర్నర్ను కలిసిన డా.ఎన్.వి. సుధా కిరణ్
- సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026 ప్రారంభం
- మార్కెట్ లోకి రూ.500 ప్లాస్టిక్ నోట్లు? RBI క్లారిటీ
- 50 ఏళ్ల వయసు వచ్చే వరకు రెన్యువల్ డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ!
- ప్రత్యేక రాష్ట్రం సాధించినా తెలంగాణ ప్రజల బతుకులు మారలేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- ప్రపంచ రికార్డు సృష్టించిన మేఘా ఇంజనీరింగ్ అద్భుతం..
- మహిళల ఆశీర్వాదంతో 2034 వరకు మేమే అధికారంలో ఉంటాం: సీఎం రేవంత్
- వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం..కూటమి ప్రభుత్వం పై విమర్శలు
- యూఏఈ లాటరీ గెలుచున్న సెక్యూరిటీ గార్డు
- షార్జా–మస్కట్ రూట్లో అదనపు సర్వీసులు









