ఎయిర్ ఇండియా జెడ్డా విమానం లో సాంకేతికలోపం
- July 25, 2015
ఇంజిన్లో సాంకేతికలోపం తలెత్తడంతో నిలిచిపోయిన ఎయిర్ ఇండియా జెడ్డా విమానం ఒకరోజు ఆలస్యంగా బయలుదేరింది. శుక్రవారం రాత్రి 7 గంటలకు 155 మంది ప్రయాణికులతో శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన ఏఐ 965 విమానంలో సాంకేతిక లోపం తలె త్తడంలో అధికారులు దాన్ని నిలిపివేశారు. శనివారం సాయంత్రం వరకు కూడా విమానంలోని సాంకేతికలోపం సరికాకపోవడంతో ఓ దశలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. దీంతో సంబంధిత అధికారులు ప్రత్యామ్నాయంగా మరో విమానాన్ని ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం 7 గంటలకు 155 ప్రయాణికులతో జెడ్డా విమానం ఇక్కడి నుంచి బయలుదేరినట్లు ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







