కువైట్ సార్వభౌమాధికారానికి భారత్ మద్దతు..!!

- June 10, 2026 , by Maagulf
కువైట్ సార్వభౌమాధికారానికి భారత్ మద్దతు..!!

కువైట్: కువైట్ సార్వభౌమాధికారానికి భారత్ మద్దతు తెలిపింది. ఈ మేరకు కువైట్ అమీర్, షేక్ మెషాల్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్ సబాకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. పశ్చిమ ఆసియాలో తాజా భద్రతా పరిస్థితిపై ప్రధాని మోదీ ఆరా తీశారు. వారు ప్రాంతీయ పరిణామాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఉద్రిక్తతలు పెరగడంపై ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కువైట్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతపై జరుగుతున్న దాడులను ఖండించారు. వీలైనంత త్వరగా శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి ఉద్రిక్తతలను తగ్గించడం, చర్చలు, దౌత్యం అవసరమని పునరుద్ఘాటించారు.

కువైట్‌లో నివసిస్తున్న భారతీయ సమాజం సంక్షేమం, భద్రతపై అమీర్ వ్యక్తిగత శ్రద్ధ చూపినందుకు ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత పౌరులకు అందిస్తున్న సంరక్షణను ఆయన ప్రశంసించారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com