కువైట్ సార్వభౌమాధికారానికి భారత్ మద్దతు..!!
- June 10, 2026
కువైట్: కువైట్ సార్వభౌమాధికారానికి భారత్ మద్దతు తెలిపింది. ఈ మేరకు కువైట్ అమీర్, షేక్ మెషాల్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్ సబాకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. పశ్చిమ ఆసియాలో తాజా భద్రతా పరిస్థితిపై ప్రధాని మోదీ ఆరా తీశారు. వారు ప్రాంతీయ పరిణామాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఉద్రిక్తతలు పెరగడంపై ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కువైట్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతపై జరుగుతున్న దాడులను ఖండించారు. వీలైనంత త్వరగా శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి ఉద్రిక్తతలను తగ్గించడం, చర్చలు, దౌత్యం అవసరమని పునరుద్ఘాటించారు.
కువైట్లో నివసిస్తున్న భారతీయ సమాజం సంక్షేమం, భద్రతపై అమీర్ వ్యక్తిగత శ్రద్ధ చూపినందుకు ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత పౌరులకు అందిస్తున్న సంరక్షణను ఆయన ప్రశంసించారు.
తాజా వార్తలు
- దుబాయ్ వాటర్ఫ్రంట్ రెస్టారెంట్ సమీపంలో వేల్ షార్క్ హల్చల్..!!
- రబీగ్ తీరంలో ఏడుగురిని రక్షించిన భద్రతా దళాలు..!!
- అల్ ముగ్సైల్ రోడ్ బ్రిడ్జ్ 85% పూర్తి.. జూలైలో ప్రారంభం..!!
- కువైట్ సార్వభౌమాధికారానికి భారత్ మద్దతు..!!
- సరికొత్త ఇంటరాక్టివ్ షోలతో రాబోతున్న టాయ్ ఫెస్టివల్..!!
- ఖతారీ మదర్, ఖతార్లో జన్మించిన పిల్లల ఎన్రోల్మెంట్..!!
- ప్రముఖ దర్శకుడు భారతీరాజా కన్నుమూత..
- దుబాయ్ పర్యాటకులకు శుభవార్త.. 48 గంటల్లో సింగిల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా
- తెలంగాణ గవర్నర్ను కలిసిన డా.ఎన్.వి. సుధా కిరణ్
- సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026 ప్రారంభం









