కువైట్ సార్వభౌమాధికారానికి భారత్ మద్దతు..!!
- June 10, 2026
కువైట్: కువైట్ సార్వభౌమాధికారానికి భారత్ మద్దతు తెలిపింది. ఈ మేరకు కువైట్ అమీర్, షేక్ మెషాల్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్ సబాకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. పశ్చిమ ఆసియాలో తాజా భద్రతా పరిస్థితిపై ప్రధాని మోదీ ఆరా తీశారు. వారు ప్రాంతీయ పరిణామాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఉద్రిక్తతలు పెరగడంపై ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కువైట్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతపై జరుగుతున్న దాడులను ఖండించారు. వీలైనంత త్వరగా శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి ఉద్రిక్తతలను తగ్గించడం, చర్చలు, దౌత్యం అవసరమని పునరుద్ఘాటించారు.
కువైట్లో నివసిస్తున్న భారతీయ సమాజం సంక్షేమం, భద్రతపై అమీర్ వ్యక్తిగత శ్రద్ధ చూపినందుకు ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత పౌరులకు అందిస్తున్న సంరక్షణను ఆయన ప్రశంసించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!







