CMYF మస్కట్ టీం హెడ్ చందక రాందాస్కు ప్రత్యేక గుర్తింపు
- June 11, 2026
మస్కట్: ఒమాన్లో భారత రాయబారిగా తన పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసి వీడ్కోలు తీసుకుంటున్న సందర్భంగా మాజీ భారత రాయబారి జి.వి.శ్రీనివాస్, సామాజిక సేవా రంగంలో విశేష కృషి చేసిన CMYF మస్కట్ హెడ్ చందక రాందాస్ ని ప్రత్యేకంగా సన్మానించారు.
మస్కట్లో ఉన్న కాలమంతా సామాజిక సేవను ఒక ఉద్యమంలా కొనసాగిస్తూ, తెలుగు కమ్యూనిటీ అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన రాందాస్, ఆపదలో ఉన్న వారికి “నేనున్నా” అనే భరోసా కల్పిస్తూ అనేక సేవా కార్యక్రమాలను చేపట్టారు. తెలుగు ప్రజలకు అండగా నిలుస్తూ ఆయన సేవలను గుర్తించిన శ్రీనివాస్ ప్రత్యేక ధృవీకరణ పత్రాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు.
ఈ సన్మానం కేవలం చందక రాందాస్ కే కాకుండా, మొత్తం తెలుగు కమ్యూనిటీకి దక్కిన గౌరవంగా పలువురు అభిప్రాయపడ్డారు.ముఖ్యంగా ఆయన ఆదర్శ వ్యక్తిత్వం, సేవా తపన, మానవతా దృక్పథానికి లభించిన అరుదైన గుర్తింపుగా కమ్యూనిటీ సభ్యులు కొనియాడుతున్నారు.
తెలుగు సమాజం కోసం నిరంతరం శ్రమిస్తున్న రాందాస్ కి లభించిన ఈ గౌరవం, భవిష్యత్తులో మరింత మంది సేవా కార్యక్రమాల వైపు అడుగులు వేయడానికి స్ఫూర్తినిస్తుందని పలువురు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విదేశీ విద్య కోసం రూ.25 లక్షల సాయం
- ఒమన్ తీరంలో మరో భారతీయ నౌకపై దాడి!
- మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై జగన్ తీవ్ర ఆరోపణలు!
- దుబాయ్ మినీబస్ ప్రమాదం: డ్రైవర్కు పరిశుభ్రమైన డ్రైవింగ్ రికార్డు..
- క్రికెట్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్..
- ఓపెన్డోర్ కార్యకలాపాలు మూసివేత..
- మాదకద్రవ్యాలు, సైబర్ నేరాల నియంత్రణకు ప్రాధాన్యం: డీజీపీ ఆనంద్
- ఘనాలో ఫార్మా హబ్కు తెలంగాణ అండ
- CMYF మస్కట్ టీం హెడ్ చందక రాందాస్కు ప్రత్యేక గుర్తింపు
- పేటెంట్ పరిశీలనపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించిన MOCI..!!









